Rapthadu Heat: వైసీపీ ఎమ్మెల్యే సోదరులపై కేసు నమోదు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rapthadu Heat: శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. తాజాగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు తోపుదుర్తి చందు, రాజశేఖర్ రెడ్డిలపై సీకే పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీకే పల్లికి చెందిన మరికొందరు వైసీపీ నాయకులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్త గంటాపురం జగ్గుపై దాడి చేసిన వైసీపీ నాయకులపై బెయిలబుల్ కేసులు, అక్రమ అరెస్ట్ బాధితుడు జగ్గుపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టి సీకే పల్లి పోలీసులు జైలుకు పంపారు. మరోవైపు పోలీస్ 30 ఆక్ట్ ఉల్లంఘించారని మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, బీకే పార్థసారథిలపై సీకే పల్లి పోలీస్ స్టేషన్లో సుమోటో కేసు నమోదైంది.
Read Also: Sasana Sabha: ‘శాసనసభ’ ట్రైలర్ను ఆవిష్కరించిన మంత్రి రోజా
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
అటు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సోదరుడు చంద్రశేఖర్రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి పరిటాల సునీత తీవ్రంగా ఖండించారు. ఒక పార్టీ అధినేతను ముసలోడు అంటూ సంభోదించడం సిగ్గుచేటు అని.. భవిష్యత్లో చంద్రశేఖర్రెడ్డి ముసలోడు కాడా అంటూ ప్రశ్నించారు. మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హితవు పలికారు. చంద్రబాబును చంపేస్తారా.. పరిటాల కుటుంబాన్ని భూస్థాపితం చేస్తారా.. అయితే రండి చూసుకుందాం అంటూ ఆమె సవాల్ విసిరారు.
మరోవైపు తన సోదరుడు చేసిన కామెంట్లపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి కూడా స్పందించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఫ్యాక్షన్ నైజాన్ని దృష్టిలో పెట్టుకుని తన తమ్ముడు మాట్లాడాడు అని.. తన తమ్ముడు మాట్లాడిన భాష తప్పు అని, కానీ భావం సరైందే అని సమర్ధించారు. చంద్రబాబు, లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గోబెల్స్ ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. వైసీపీలో కొంత మంది ఎమ్మెల్యేల వ్యక్తిత్వ హనానికి టీడీపీ నేతలు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలవలేక బట్టకాల్చి మీద వేస్తున్నారని.. అనంతపురం జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ రెచ్చగొట్టే చర్యలు కనిపిస్తున్నాయని విమర్శలు చేశారు. అనంతపురంలో పారిన నెత్తురు దాని వెనుక చంద్రబాబు హస్తం గురించి చర్చించాలన్నారు. ఎన్నికల తర్వాత రాప్తాడు ఏరియా ప్రశాంతంగా ఉందని.. దానిని భగ్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి అన్నారు. టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అనంతపురం జిల్లా ప్రజలు నమ్మవద్దని కోరారు. ఆధిపత్యం కోసం హత్యా రాజకీయాలను ప్రోత్సహించింది పరిటాల కుటుంబమేనని ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
-
Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!