Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Btech Student Ramyas Family Meets Ap Cm Ys Jagan

సీఎం జగన్‌ను కలిసిన రమ్య కుటుంబ సభ్యులు..

Published Date :September 9, 2021 , 8:14 pm
By Sudhakar Ravula
సీఎం జగన్‌ను కలిసిన రమ్య కుటుంబ సభ్యులు..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

క్యాంప్‌ కార్యాలయంలో సీఎం ఐఎస్‌ జగన్‌ను కలిశారు రమ్య కుటుంబ సభ్యులు.. జరిగిన ఘటనపై సీఎం జగన్‌ను వివరించారు రమ్య తల్లిదండ్రులు జ్యోతి, వెంకటరావు, అక్క మౌనికలు.. ఆ కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం, ధైర్యాన్ని చెప్పారు.. తాము ఉన్నామంటూ హామీ ఇచ్చారు.. రమ్య కుటుంబ సభ్యులతో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున కూడా సీఎంను కలిసినవారిలో ఉన్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన హోంమంత్రి సుచరిత.. పదిరోజుల్లో ఉద్యోగ నియామకం అయ్యాక సీఎంతో టీ తాగే అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.. మహిళల అత్యాచారం కేసుల్లో ఏడు రోజుల్లో చార్జ్ షీట్ వేస్తున్నాం.. ఇప్పటివరకు 1600 పైగా కేసుల్లో ఏడు రోజుల్లో చార్జిషీట్ వేశామని తెలిపిన ఆమె.. దిశ యాప్ ను 46 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఇంకా 50 శాతం పైన ప్రజలకు దిశ యాప్ పై అవగాహన లేదని.. దిశ యాప్, చట్టంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

మరోవైపు.. టీడీపీ నేతలను టార్గెట్‌ చేసి విమర్శలు కురిపంచారు సుచరిత.. 2018లో హత్యాచారానికి గురైన సుగాలి ప్రీతి కేసులో చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నించిన ఆమె.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సీబీఐ విచారణకు ఆదేశించామని గుర్తుచేశారు.. సుగాలి ప్రీతి కుటుంబాన్ని కూడా లోకేష్ పరామర్శిస్తే బాగుంటుందని హితవుపలికిన ఆమె.. మహిళల్లో అభద్రత భావాన్ని పెంచేలా లోకేష్ వ్యవహరించడం దురదృష్టకరం అన్నారు.. చిత్తశుద్ది ఉంటే పార్లమెంట్ లో దిశ చట్టం ఆమోదం కోసం టీడీపీ ఎంపీలు కృషి చేయాలని డిమాండ్‌ చేవారు. మహిళ చనిపోతే బాగుండు అక్కడికి వెళ్లి రాజకీయం చేసుకుంటా అనుకుంటున్నారు లోకేష్ అంటూ ఎద్దేవా చేవారు సుచరిత.. టీడీపీ హయాంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయటానికే రెండు వందల రోజులకు పైగా పట్టేదని మండిపడ్డ ఆమె.. కాల్ మనీ కేసుల్లో అధికార పార్టీ నేతలున్నారని చెప్పినా గత ప్రభుత్వంలో చర్యలు తీసుకోలేదన్నారు. గత ప్రభుత్వంలో వనజాక్షి విషయంలో చంద్రబాబు, లోకేష్ స్పందించలేదని.. కానీ, ఇప్పుడు లోకేష్‌ శవ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read

  • AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
  • TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
  • MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
  • Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
Add as a preferred
source on google

మరోవైపు.. తాడేపల్లి ఘటనలో ఒక నిందితున్ని పట్టుకున్నాం రెండో నిందితున్నీ త్వరలో పట్టుకుంటామని తెలిపారు హోంమంత్రి సుచరిత.. మేడికొండూరు వివాహితపై అత్యాచారం ఘటనలో పోలీసులు వెంటనే స్పందించారన్న ఆమె.. ఫిర్యాదు తీసుకోలేదనేదు అనేది అవాస్తవం అన్నారు. దిశ చట్ట ప్రతులను లోకేష్ కాల్చడం అంటే చట్టాలపై వారికి ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందన్నారు.. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్ట ప్రకారమే కేసులు నమోదు చేస్తున్నాం.. రమ్య కేసు నిందితుడికి విచారణ కోసం స్పెషల్ కోర్టు పెట్టి వేగంగా శిక్ష పడేలా చేయాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు.. చట్టం అమల్లోకి వచ్చాక 21 రోజుల్లోనే నిందితులకు శిక్ష ఖరారు చేస్తామని తెలిపారు సుచరిత. కాగా, గుంటూరులో హత్యకు గురైన బీటెక్ స్టూడెంట్ రమ్య కేసు ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • BTech Student Ramya
  • CM YS Jagan
  • Guntur
  • Ramya's Family

తాజావార్తలు

  • Peddi : థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి!

  • CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!

  • AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..

  • Tamil Nadu: విజయ్‌‌కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్‌భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?

  • TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions