Botsa Satyanarayana: పులివెందుల ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేసింది..
- పులివెందుల ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేసింది..
- ఎన్నికలంటే ప్రభుత్వానికి అభద్రత ఎందుకో చంద్రబాబు చెప్పాలి..
- చంద్రబాబుకు తన పాలనపై నమ్మకం లేదని అర్థమవుతోంది..
- ఒక జెడ్పీటీసీ ఉంటే ఎంత?.. పోతే ఎంత?: బొత్స సత్యనారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పులివెందుల ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేసింది.. ఎన్నికలు అంటే ప్రభుత్వానికి ఎందుకు భద్రతాభావం కలుగుతుందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. 14 నెలల్లో రాష్ట్రాన్ని ఉద్ధరించానని చెప్పుకునే చంద్రబాబుకే తన పాలనపై నమ్మకం లేదనే విషయం అర్థమవుతోందని పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటారు.. కానీ, మంత్రిని మాత్రం విచ్చలవిడిగా తిరగనిస్తారా? అని మండిపడ్డారు. ఇక, పోలీసులు, టీడీపీ కార్యకర్తలు ఓట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దౌర్జన్యంతో గెలవాలని చూస్తే ప్రజలు చూస్తు ఊరుకోరు.. ఎన్నికల రోజును ‘బ్లాక్ డే’గా మేము భావిస్తున్నామని బొత్స చెప్పుకొచ్చారు.
Also Read
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
ఇక, పులివెందులలో ప్రజాస్వామ్యం వచ్చిందని కూటమి నేతలు చెబుతున్నారు.. ఏమి వచ్చింది.. ఒక జెడ్పీటీసీ ఉంటే ఎంత, పోతే ఎంత? అని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కానీ, ఎన్నికల ప్రక్రియ జరిగిన తీరు మాత్రం అభ్యంతరకరమైనది.. చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది? అందులో టీడీపీ వాళ్లు చొక్కాలు చింపుకోవడానికి.. చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పుకొచ్చారు. త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో.. మేము పోటీ పడతామన్నారు. కాగా, DIG స్థాయి అధికారి వచ్చి తలుపులు కొట్టడం ఏమిటి? అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేసిన వారిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ఎమ్మెల్సీ బొత్స ప్రశ్నించారు.
Read Also: Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో ఘోరం.. జవాన్లు సహా 33 మంది మృతి.. 220 మందికి పైగా గల్లంతు..!
అయితే, 2029 ఎన్నికల కోసం మంత్రి పార్థసారథినీ కాచుకుని కూర్చోమని చెబుతున్నాను అని బొత్స సత్యనారాయణ అన్నారు. ఈవీఎంలు అయితే టాంపరింగ్, బ్యాలెట్ పేపర్ అయితే రిగ్గింగ్ చేస్తామని కూటమి నేతలు పరోక్షంగా సూచిస్తున్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్లో 12 శాతం ఓటింగ్ తేడా వచ్చింది.. దానిని రాహుల్ గాంధీ ఎందుకు ప్రస్తావించలేదో వైఎస్ జగన్ ప్రశ్నించారు.. తెలంగాణలో ఉన్నది చంద్రబాబు శిష్యుడు కనుక హాట్లైన్లో ఉన్నారేమో అన్న భావన జగన్ది అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్కు త్రిషా కృష్ణన్.. విజయ్తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్లో చర్చ
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!