Botsa Satyanarayana: పులివెందుల ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేసింది..
- పులివెందుల ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేసింది..
- ఎన్నికలంటే ప్రభుత్వానికి అభద్రత ఎందుకో చంద్రబాబు చెప్పాలి..
- చంద్రబాబుకు తన పాలనపై నమ్మకం లేదని అర్థమవుతోంది..
- ఒక జెడ్పీటీసీ ఉంటే ఎంత?.. పోతే ఎంత?: బొత్స సత్యనారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పులివెందుల ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేసింది.. ఎన్నికలు అంటే ప్రభుత్వానికి ఎందుకు భద్రతాభావం కలుగుతుందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. 14 నెలల్లో రాష్ట్రాన్ని ఉద్ధరించానని చెప్పుకునే చంద్రబాబుకే తన పాలనపై నమ్మకం లేదనే విషయం అర్థమవుతోందని పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటారు.. కానీ, మంత్రిని మాత్రం విచ్చలవిడిగా తిరగనిస్తారా? అని మండిపడ్డారు. ఇక, పోలీసులు, టీడీపీ కార్యకర్తలు ఓట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దౌర్జన్యంతో గెలవాలని చూస్తే ప్రజలు చూస్తు ఊరుకోరు.. ఎన్నికల రోజును ‘బ్లాక్ డే’గా మేము భావిస్తున్నామని బొత్స చెప్పుకొచ్చారు.
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ఇక, పులివెందులలో ప్రజాస్వామ్యం వచ్చిందని కూటమి నేతలు చెబుతున్నారు.. ఏమి వచ్చింది.. ఒక జెడ్పీటీసీ ఉంటే ఎంత, పోతే ఎంత? అని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కానీ, ఎన్నికల ప్రక్రియ జరిగిన తీరు మాత్రం అభ్యంతరకరమైనది.. చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది? అందులో టీడీపీ వాళ్లు చొక్కాలు చింపుకోవడానికి.. చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పుకొచ్చారు. త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో.. మేము పోటీ పడతామన్నారు. కాగా, DIG స్థాయి అధికారి వచ్చి తలుపులు కొట్టడం ఏమిటి? అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేసిన వారిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ఎమ్మెల్సీ బొత్స ప్రశ్నించారు.
Read Also: Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో ఘోరం.. జవాన్లు సహా 33 మంది మృతి.. 220 మందికి పైగా గల్లంతు..!
అయితే, 2029 ఎన్నికల కోసం మంత్రి పార్థసారథినీ కాచుకుని కూర్చోమని చెబుతున్నాను అని బొత్స సత్యనారాయణ అన్నారు. ఈవీఎంలు అయితే టాంపరింగ్, బ్యాలెట్ పేపర్ అయితే రిగ్గింగ్ చేస్తామని కూటమి నేతలు పరోక్షంగా సూచిస్తున్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్లో 12 శాతం ఓటింగ్ తేడా వచ్చింది.. దానిని రాహుల్ గాంధీ ఎందుకు ప్రస్తావించలేదో వైఎస్ జగన్ ప్రశ్నించారు.. తెలంగాణలో ఉన్నది చంద్రబాబు శిష్యుడు కనుక హాట్లైన్లో ఉన్నారేమో అన్న భావన జగన్ది అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!