Botsa Satyanarayana: పులివెందుల ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేసింది..
- పులివెందుల ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేసింది..
- ఎన్నికలంటే ప్రభుత్వానికి అభద్రత ఎందుకో చంద్రబాబు చెప్పాలి..
- చంద్రబాబుకు తన పాలనపై నమ్మకం లేదని అర్థమవుతోంది..
- ఒక జెడ్పీటీసీ ఉంటే ఎంత?.. పోతే ఎంత?: బొత్స సత్యనారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పులివెందుల ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేసింది.. ఎన్నికలు అంటే ప్రభుత్వానికి ఎందుకు భద్రతాభావం కలుగుతుందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. 14 నెలల్లో రాష్ట్రాన్ని ఉద్ధరించానని చెప్పుకునే చంద్రబాబుకే తన పాలనపై నమ్మకం లేదనే విషయం అర్థమవుతోందని పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటారు.. కానీ, మంత్రిని మాత్రం విచ్చలవిడిగా తిరగనిస్తారా? అని మండిపడ్డారు. ఇక, పోలీసులు, టీడీపీ కార్యకర్తలు ఓట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దౌర్జన్యంతో గెలవాలని చూస్తే ప్రజలు చూస్తు ఊరుకోరు.. ఎన్నికల రోజును ‘బ్లాక్ డే’గా మేము భావిస్తున్నామని బొత్స చెప్పుకొచ్చారు.
Also Read
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
- Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
- OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
- Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..
ఇక, పులివెందులలో ప్రజాస్వామ్యం వచ్చిందని కూటమి నేతలు చెబుతున్నారు.. ఏమి వచ్చింది.. ఒక జెడ్పీటీసీ ఉంటే ఎంత, పోతే ఎంత? అని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కానీ, ఎన్నికల ప్రక్రియ జరిగిన తీరు మాత్రం అభ్యంతరకరమైనది.. చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది? అందులో టీడీపీ వాళ్లు చొక్కాలు చింపుకోవడానికి.. చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పుకొచ్చారు. త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో.. మేము పోటీ పడతామన్నారు. కాగా, DIG స్థాయి అధికారి వచ్చి తలుపులు కొట్టడం ఏమిటి? అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేసిన వారిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ఎమ్మెల్సీ బొత్స ప్రశ్నించారు.
Read Also: Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో ఘోరం.. జవాన్లు సహా 33 మంది మృతి.. 220 మందికి పైగా గల్లంతు..!
అయితే, 2029 ఎన్నికల కోసం మంత్రి పార్థసారథినీ కాచుకుని కూర్చోమని చెబుతున్నాను అని బొత్స సత్యనారాయణ అన్నారు. ఈవీఎంలు అయితే టాంపరింగ్, బ్యాలెట్ పేపర్ అయితే రిగ్గింగ్ చేస్తామని కూటమి నేతలు పరోక్షంగా సూచిస్తున్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్లో 12 శాతం ఓటింగ్ తేడా వచ్చింది.. దానిని రాహుల్ గాంధీ ఎందుకు ప్రస్తావించలేదో వైఎస్ జగన్ ప్రశ్నించారు.. తెలంగాణలో ఉన్నది చంద్రబాబు శిష్యుడు కనుక హాట్లైన్లో ఉన్నారేమో అన్న భావన జగన్ది అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
-
Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక… త్వరలోనే గుడ్ న్యూస్
-
PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
-
Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
-
CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!