BJP Satyakumar: అక్రమాలను అడ్డుకుంటే దాడులా?
అధికార పార్టీ తీరుపై మండిపడ్డారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ అక్రమాలను ప్రశ్నించినందుకు మా పార్టీ నేతలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.ధర్మవరం ఎమ్మెల్యే అక్రమాలను, అధికారపార్టీ ఆగడాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు తెగబడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తోంది. ప్రెస్క్ క్లబ్ లో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దాడుల వెనుక ఉన్న ఎమ్మెల్యే సహా అందరిపైనా కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి. ఇప్పటికే ఈ విషయం పై రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడారు. డీజీపీ, ఇతర ఉన్నతాధికారులను ఈ విషయంపై కలుస్తున్నాం. దాడికి ప్రేరేపించిన వారిపైన చర్యలు తీసుకోవాలి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్రంలో పూర్తిగా శాంతిభద్రతలు లోపించాయన్నారు. ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలపై దాడులు కొనసాగుతున్నాయి.ధర్మవరంలో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిందితులపై కేసులు నమోదు చేసి 24 గంటల్లో అరెస్టు చేయాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతాం అని విష్ణువర్థన్ రెడ్డి హెచ్చరించారు.
Also Read
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
బీజేపీ నేతలపై దాడి గర్హనీయం అన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. ధర్మవరంలో భారతీయ జనతా పార్టీ నేతలపై వైసీపీ దాడి చేయడం అధికార పక్షం దౌర్జన్యమే.ప్రెస్ క్లబ్ లో అందరూ చూస్తుండగా దాడికి తెగబడ్డారంటే దాష్టీకాలు ఏ స్థాయికి చేరాయో అర్థం అవుతోంది. ప్రజాస్వామ్య విలువలను పాటించే ప్రతి ఒక్కరూ ఈ దాడిని గర్హించాలి. పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించకపోతే నేర ప్రవృతి కలిగిన నాయకులు పేట్రేగిపోతారన్నారు మనోహర్.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!