CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Markapuram Tour: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మార్కాపురం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేయనున్నారు. అలాగే గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ను ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్లోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉదయం 10.45 గంటలకు దోర్నాల మండలం గంటవానిపల్లె సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రహదారి మార్గంలో ప్రాజెక్టు వద్దకు వెళ్లి అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు. జూలై నెల తొలి దశ లక్ష్యాలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో వేగంగా కొనసాగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేసి, లబ్ధిదారులు, రైతులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.
Also Read
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
ఇక, మధ్యాహ్నం 12.35 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 12.55 గంటలకు గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టిపల్లెకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ను ప్రారంభించి, లబ్ధిదారులు, వైద్య సిబ్బందితో సమావేశమవుతారు. సంజీవని కార్యక్రమం అమలు తీరుపై ఆరా తీస్తూ ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించనున్నారు. తదుపరి మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రజావేదిక వద్ద జరిగే సభలో పాల్గొని ప్రసంగించనున్న ముఖ్యమంత్రి, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.35 గంటల నుంచి సాయంత్రం వరకు టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో పాల్గొని పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. సాయంత్రం హెలిప్యాడ్కు చేరుకుని అక్కడి నుంచి అమరావతి (ఉండవల్లి నివాసం)కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఒకే రోజులో యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తాజావార్తలు
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?