CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Markapuram Tour: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మార్కాపురం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేయనున్నారు. అలాగే గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ను ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్లోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉదయం 10.45 గంటలకు దోర్నాల మండలం గంటవానిపల్లె సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రహదారి మార్గంలో ప్రాజెక్టు వద్దకు వెళ్లి అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు. జూలై నెల తొలి దశ లక్ష్యాలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో వేగంగా కొనసాగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేసి, లబ్ధిదారులు, రైతులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఇక, మధ్యాహ్నం 12.35 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 12.55 గంటలకు గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టిపల్లెకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ను ప్రారంభించి, లబ్ధిదారులు, వైద్య సిబ్బందితో సమావేశమవుతారు. సంజీవని కార్యక్రమం అమలు తీరుపై ఆరా తీస్తూ ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించనున్నారు. తదుపరి మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రజావేదిక వద్ద జరిగే సభలో పాల్గొని ప్రసంగించనున్న ముఖ్యమంత్రి, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.35 గంటల నుంచి సాయంత్రం వరకు టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో పాల్గొని పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. సాయంత్రం హెలిప్యాడ్కు చేరుకుని అక్కడి నుంచి అమరావతి (ఉండవల్లి నివాసం)కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఒకే రోజులో యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!