Vishnu Vardhan Reddy: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్ధిస్తున్నాం.. టీడీపీని మోయాల్సిన అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnu Vardhan Reddy: ప్రధాని మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో బీజేపీ కీలక నేతలందరూ విశాఖలోనే మకాం వేశారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు విష్ణువర్ధన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ లైన్, జనసేన లైన్ ఒక్కటేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తాము సమర్థిస్తున్నామని విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. వైసీపీ వ్యతిరేక ఓటు టీడీపీకి వెళ్లకుండా చూసుకోవడమే బీజేపీ-జనసేన ముందున్న ఉమ్మడి లక్ష్యమని పేర్కొన్నారు. పెద్ద పార్టీలని చెప్పుకుంటున్న చాలా పార్టీలు కముమరుగైన పరిస్థితి ఉందని.. టీడీపీ బలమైన పార్టీ అయితే తెలంగాణలో ఎందుకు కనుమరుగైందని.. ఏపీలో ఎందుకు చతికిలపడిందో చెప్పాలన్నారు. ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ భేటీ తర్వాత ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారబోతోందని విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. టీడీపీని భుజాల మీద మోయాల్సిన అవసరం బీజేపీ-జనసేనకు లేదని స్పష్టం చేశారు.
Read Also: Nizam College Students : 50వద్దు మాకు 100కావాలని డిమాండ్ చేస్తున్న స్టూడెంట్లు
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
మరోవైపు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా మీడియాతో మాట్లాడారు. తాము కుటుంబ, అవినీతి పార్టీలకు వ్యతిరేకం అని సోము వీర్రాజు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా తమ విధానం అలాగే ఉంటుందన్నారు. తమ విధానాన్ని పదే పదే చెబుతున్నా.. మీడియా మళ్లీ అవే ప్రశ్నలు అడుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతో కోర్ కమిటీ జరిపే సభ్యుల సమావేశంలో కూడా ఇదే తరహాలో చర్చ జరుగుతుందని సోము వీర్రాజు తెలిపారు. తమ పార్టీది అభివృద్ధి అజెండా అని.. ప్రధానితో కోర్ కమిటీ, పవన్ కళ్యాణ్ భేటీలో కచ్చితంగా రాజకీయ పరమైన అంశాలు చర్చకు వస్తాయన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రజాభిప్రాయం ఏంటనేది కేంద్రం దృష్టిలో ఉందని సోము వీర్రాజు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!