Satya Kumar: తెలంగాణాలో ఉన్నది 17 స్థానాలే.. దేశంలో 543 పార్లమెంట్ స్థానాలు ఉన్న విషయం మరిచారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satya Kumar: తెలంగాణాలో 17 పార్లమెంట్ స్థానాలు మాత్రమే ఉన్నాయి.. దేశంలో 543 పార్లమెంట్ స్థానాలు ఉన్న విషయం కేసీఆర్ మరిచిపోయారు అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. ప్రకాశం జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగరాలని చూసినట్టు ఉంది కేసీఆర్ పరిస్థితి అని ఎద్దేవా చేశారు.. దొంగ దొరికి పోతున్నప్పుడు రకరకాల విన్యాసాలు చేస్తారు.. ఢిల్లీ మద్యం కేసులో టీఆర్ఎస్ నాయకులు కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. దోచుకున్న లక్ష కోట్లు ఎవరికి అప్పచెప్పాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని మండిపడ్డారు.. ఇక, కేసీఆర్కి.. ప్రధాని నరేంద్ర మోడీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.. మహిళా సాధికారత గురించి కవిత మాట్లాడటం హాస్యాస్పదమన్న ఆయన.. అస్కార్ అవార్డు పొరపాటున రాజమౌళికి వచ్చింది.. కేసీఆర్ కుటుంబానికి ఎప్పుడో ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సింది అంటూ సెటైర్లు వేశారు సత్యకుమార్..
Read Also: Tarun Chugh : లిక్కర్ స్కామ్లో వందల కోట్ల అవినీతి.. కవిత తప్పకుండా సమాధానం చెప్పాల్సిందే
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
మరోవైపు.. వైసీపీ, బీజేపీ భిన్నధృవాలు అని వ్యాఖ్యానించారు సత్యకుమార్.. ఆ పార్టీతో కలిసేది లేదు, సమర్థించేదీ లేదని స్పష్టం చేశారు.. అవినీతి కేసుల్లో వైఎస్ జగన్ గతంలోనే జైలుకెళ్లాడు అన్నారు.. ఇక, జగన్ బాబాయి హత్య కేసులో సీబీఐ విచారణ వేగంగా జరుగుతుందన్న ఆయన.. కలుగుల్లో ఉన్న ఎలుకలు అన్ని బయటకు వచ్చాయన్నారు. బాబాయి హత్య కేసులో బాధ్యులు అరెస్ట్ అవుతారని స్పష్టం చేశారు.. వైసీపీ సర్కార్పై హాట్ కామెంట్లు చేశారు సత్యకుమార్.. సీఎం వైఎస్ జగన్ పై నాలుగేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. సంవత్సరాల పాటు ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేసిన జగన్.. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాలంటే పరదాల మధ్య వెళ్తున్నాడని ఎద్దేవా చేశారు. సొంత నియోజక వర్గం పులివెందుల వెళ్లాలన్నా 1500 మంది పోలీసుల మధ్య వెళ్తున్నారని విమర్శించారు.
Read Also: Canada: భారత్ ముద్దు.. చైనా వద్దు.. డ్రాగన్ కంట్రీని ముప్పుగా భావిస్తున్న కెనడియన్లు..
జగన్ ప్రభుత్వంపై ఉద్యోగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు సత్యకుమార్.. టీచర్లను మద్యం షాపుల వద్ద వాడుకుని ఎన్నికల విధులకు పనికి రారని చెబుతున్నారని మండిపడ్డారు.. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం దొంగ ఓట్లు చేర్చారు… దొంగ ఓట్ల కోసం రాష్ట్రంలో ఒక మంత్రినే పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి పంచాయతీరాజ్ శాఖని వదిలేసి దొంగ ఓట్ల కోసం ఆ మంత్రి వెళ్తున్నాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్..
- Tags
- Andhra Pradesh
- bjp
- cm kcr
- CM YS Jagan
- ED
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!