Canada: భారత్ ముద్దు.. చైనా వద్దు.. డ్రాగన్ కంట్రీని ముప్పుగా భావిస్తున్న కెనడియన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Most Canadians Believe China is a Threat: డ్రాగన్ కంట్రీ చైనాను ప్రపంచదేశాలు ముప్పుగా భావిస్తున్నాయి. కరోనా వైరస్ , చైనా దుందుడుకు వైఖరి, ఇతర దేశాలపై నిఘా, ఇతర దేశాల ఎన్నికలను ప్రభావితం చేస్తోంది చైనా. దీంతో చైనాతో ఎప్పటికైనా ప్రమాదం ఉంటుందని పలు దేశాలు భావిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కెనడా కూడా చేరింది. ఇటీవల నిర్వహించిన ఓ పోల్ లో కెనడా ప్రజలు చైనాతో ముప్పు ఉందని భావిస్తున్నారు. ఇదే సమయంలో భారత్ తో సన్నిహిత సంబంధాలను కోరుకోవడం గమనార్హం. శుక్రవారం విడుదల చేసిన కొత్త సర్వే ప్రకారం.. మెజారిటీ కెనడియన్లు భారత్ పై సానుకూల దృక్పథంతో ఉన్నారు.
Read Also: Swati Maliwal : మా నాన్న నన్ను లైంగికంగా వేధించాడు.. మహిళ కమిషన్ చీఫ్ సంచలనం
Also Read
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
పబ్లిక్ ఓపీనియన్ రీసెర్చ్ ఏజెన్సీ ఏఆర్ఐ ఫిబ్రవరి చివరల్లో ఈ పోల్ నిర్వహించింది. మొత్తం 1622 మంది ఈ పోల్ లో పాల్గొన్నారు. ఇందులో మెజారిటీ కెనడియన్లు చైనాను ముప్పుగా భావిస్తున్నారు. ఏకంగా ఇది 40 శాతం ఉంది. అత్యంత ప్రమాదకమైన శత్రువుగా భావించే వారు 22 శాతం ఉన్నారు. కేవలం 12 మంది చైనాకు అనుకూలంగా ఉన్నారు. ఇక ఉక్రెయిన్ పై దాడి చేసిన రష్యా, చైనా కన్నా ఎక్కువ ముప్పు ఉందని కెనడా ప్రజలు ఓటేశారు. ఏకంగా 72 శాతం మంది కెనడా ప్రయోజనాలకు రష్యా ముప్పు అని తెలిపారు. ఇక భారత్ విషయానికి వస్తే 42 శాతం మంది భారత్ స్నేహపూర్వక దేశమని, 10 శాతం మంది విలువైన భాగస్వామి, మిత్రదేశంగా పరిగణించాలని అభిప్రాయపడుతున్నారు. తైవాన్ పట్ట్ 62 శాతం కెనడియన్లు అనుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు.
ఇటీవల కెనడా గగనతలంలో చైనీస్ స్పై బెలూన్లు, గత రెండు కెనడా ఎన్నికల్లో చైనా జోక్యం వార్తలు వెలుగులోకి వచ్చాయి. కెనడాలో 2019, 2021 ఫెడరల్ ఎన్నికల్లో చైనా జోక్యం గురించి గ్లోబ్, మెయిల్, గ్లోబల్ న్యూస్ పలు కథనాలు ప్రచురించింది. ఇది ఆ దేశంలో పెను దుమారాన్ని రేపింది. అయితే ఈ ఆరోపణలపై విచారణ చేయాలా.? వద్దా.? అనేదానిపై పరిశీలకులను నియమిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
-
China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
-
Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
-
Pakistan Restores Historic Hindu Names : పాకిస్తాన్ ‘హిందూ’ జపం.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!