Robbery in Narsapur Express: రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్.. నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో దోపిడీ
- రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో దోపిడీ..
- నాగర్సోల్ నుంచి నరసాపురం వెళుతున్న నర్సాపూర్ ఎక్స్ ప్రెస్..
- మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి సమీపంలో సిగ్నలింగ్ ట్యాంపర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robbery in Narsapur Express: రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో దోపిడీకి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది.. రైల్వే వ్యవస్థ సిగ్నలింగ్ పై ఆధారపడి నడుస్తుంది.. ఇక, రాత్రి సమయంలో మరింత జాగ్రత్తగా లోకో పైలట్లు ఈ సిగ్నల్ను ఫాలో కావాల్సి ఉంటుంది.. అదే అదునుగా భావించిన దొంగల రెచ్చిపోయారు.. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి నర్సాపూర్ ఎక్స్ప్రెస్లోకి దూరారు.. ముగ్గురు మహిళల మెడలోని బంగారు ఆభరణాలను చోరీ చేసి పరారయ్యారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడి కుడి రైల్వే స్టేషన్ సమీపంలోని 146/06 మైలురాయి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
Read Also: Modi-Rabuka: ఎవరో మీతో సంతోషంగా లేరు.. మోడీతో ఫిజీ ప్రధాని వ్యాఖ్య
Also Read
- Digital Arrest Scam: బాపట్లలో రిటైర్డ్ టీచర్ డిజిటల్ అరెస్ట్.. రూ.60 లక్షలు కాజేసిన కేటుగాళ్లు..
- CM Chandrababu: మొన్న మూడుముక్కలాట.. నిన్న మావిగన్.. వెయ్యి మంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు..
- Land Dispute: బాపట్ల ఎస్పీ ఫ్యామిలీ భూకబ్జా.. కొనసాగుతున్న విచారణ
- Minister Nadendla: రైతులు పడ్డ కష్టానికి ప్రభుత్వం గుర్తింపు ఇస్తుంది..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగర్సోల్ నుంచి నరసాపురం వెళుతున్న నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు తెల్ల వారుజామున 2.47 గంటలకు నడికుడి రైల్వేస్టేషన్ సమీపానికి చేరుకుంది. ఆ సమయంలో మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి సమీపంలో దుండగులు పట్టాల పక్కన హోమ్ సిగ్నలింగ్ను ట్యాంపర్ చేశారు. రెడ్ సిగ్నల్ పడటంతో లోకో పైలట్ రైలును ఆపేశారు. వెంటనే దొంగల ముఠా సభ్యులు రైల్లోకి చొరబడి ఎస్-1, ఎస్-2, ఎస్-3 బోగీల్లోని ఇద్దరు మహిళల మెడలో 68 గ్రాముల బంగారు గొలుసులు, ఓ మహిళ మెడలోని రోల్డ్ గోల్డ్ గొలుసు దోచుకున్నారు. ఎస్-5 బోగిలోనూ చోరీకి యత్నించగా ప్రయాణికులు కేకలు వేయడంతో పరారయ్యారు. ఆ సమయంలో రైలు 35 నిమిషాలపాటు నిలిచిపోయింది. విజయవాడ చెందిన ప్రయాణికురాలు శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై రమేష్ తెలిపారు. కాగా, నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలుకు భద్రతా సిబ్బంది లేకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు..
తాజావార్తలు
-
DK Shivakumar: జూన్ 3న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం.. ఆ రోజే ఎందుకంటే?
-
Rajasthan: రాజస్థాన్లో ఇసుక తుఫాన్ బీభత్సం.. బెంబేలెత్తిపోయిన ప్రజలు
-
Crime Comedy Movie : మనుషులను బురిడీ కొట్టించే గొర్రెల మంద… హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న క్రైమ్ కామెడీ
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధం.. పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్లో పేరు..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..