Murder : బాపట్లలో తండ్రీ కొడుకుల దారుణ హత్య.. జిల్లాలో కలకలం
- కోర్టుకి వెళ్తున్న తండ్రీకొడుకుల కిడ్నాప్
- పాతమాగులూరులో రియల్ ఎస్టేట్ వెంచర్లో దారుణ హత్య
- ప్రధాన నిందితుడు అనిల్ కుమార్ రెడ్డి అదుపులో
Murder : బాపట్ల జిల్లాలో తండ్రీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఓ కేసులో కోర్టుకి హాజరయ్యేందుకు వచ్చిన తండ్రి కొడుకుని కిడ్నాప్ చేసిన ప్రత్యర్థులు…గొంతు కోసి దారుణ హత్య చేశారు. ఈఘటన బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కలకలం రేపింది. ఒక్కసారిగా స్థానికులు ఉలికిపాటుకు గురయ్యారు.
బాపట్ల జిల్లా సంతమాగులూరుకి చెందిన వీరాస్వామిరెడ్డి గత కొంత కాలంగా బెంగళూరులో స్థిరపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే వీరాస్వామిరెడ్డికి, సంతమాగులూరుకి చెందిన గడ్డం అనిల్ కుమార్ రెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో వీరాస్వామిరెడ్డికి చెందిన చెక్కుల్ని అనిల్ కుమార్ రెడ్డి అద్దంకి, ఒంగోలు, నరసరావుపేట కోర్టుల్లో కేసు వేశాడు. చెల్లని చెక్కుల కేసులో పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టులో హాజరయ్యేందుకు వీరాస్వామిరెడ్డి, ఆయన కొడుకు ప్రశాంత్ రెడ్డి, లాయర్ నాగభూషణం బెంగళూరు నుంచి మంగళవారం రోజున నరసరావుపేట వచ్చారు…
Also Read
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
బుధవారం ఉదయం బయట టిఫిన్ చేసి కోర్టుకి వెళ్తున్న వీరాస్వామిరెడ్డి, ఆయన కొడుకు ప్రశాంత్ రెడ్డిని స్కార్పియో కారులో వచ్చిన గడ్డం అనిల్ కుమార్ రెడ్డి మరికొంత మందితో కలిసి కిడ్నాప్ చేశారు. అక్కడే ఉన్న స్థానికులు స్కార్పియో కారుని వెంబడించినా ఫలితం లేకుండా పోయింది…
కిడ్నాప్గు గురైన తండ్రీ కొడుకులు వీరాస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డిని బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు శివారులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో గొంతు కోసి దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసులో ప్రధాన నింధితుడు అనిల్ కుమార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల్లో వివాదాలు కారణంగా హత్యలు జరిగినట్టు తెలుస్తోంది…
మొత్తంగా తండ్రీకొడుకుల దారుణ హత్య ఘటన పల్నాడు, బాపట్ల జిల్లాల్లో తీవ్ర కలకలం రేపింది. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం నర్సరావుపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రీకొడుకుల జంట హత్యలకు గల కారణాలను విశ్లేషించేందుకు నిందితుడు అనిల్ కుమార్ రెడ్డిని విచారిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు..
తాజావార్తలు
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
-
Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?