Attacks on Lenders: తీసుకున్న అప్పు తీర్చమంటే దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకవైపేమో లోన్ యాప్ ల ద్వారా అప్పు తీసుకుని అవి తీర్చలేకపోతే యాప్ నిర్వాహకులు చేసే టార్చర్ భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇది ఒక రకమైతే అప్పు తీర్చమన్నందుకు ఏకంగా ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు ఇపుడు చోటు చేసుకోవడం భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో ఇచ్చిన అప్పు తిరిగి తీర్చమన్నందుకు ఏకంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని చోట్ల అప్పు తీసుకున్నవారిపై దాడులకు పాల్పడం వంటి ఘటనలు కలకం రేపుతున్నాయి.
కిరాణా షాపులో ఒక వ్యక్తి తీసుకున్న అప్పు తీర్చమని డిమాండ్ చేసినందుకు షాపు యజమాని ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా దెందులూరు మండలం పోతునూరులో చోటు చేసుకుంది. దీనికి కొద్ది రోజుల ముందు గాలాయగూడెంలోనూ ఇదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నచిన్న బాకీలు తీర్చలేకపోవడంతో తలెత్తుతున్న గొడవల్లో వరుసగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం వారివారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి ఏలూరు జిల్లా దెందులురు మండలం పోతునూరులో తోట నాగరాజు కిరాణా షాప్ నడుపుతున్నాడు. అతని వద్ద చాలా కాలం నుండి సరుకులు తీసుకుని లింగాల కాంతారావు అనే వ్యక్తి బాకీ పడ్డాడు. బాకీ ఆరువేలు కావడంతో దాన్ని తీర్చాలని షాపు యజమాని డిమాండ్ చేసాడు. దీంతో మాటమాట పెరిగి నాగరాజుపై కాంతారావు కత్తితో దాడిచేసాడు. రక్తపు మడుగులో పడివున్న నాగరాజును ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
Read Also: Andhra Pradesh: అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు
ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే గాలాయగూడెం గ్రామానికి చెందిన సలాది ఉదయ్ కిరణ్ కు పాలడుగు దుర్గారావుకి మధ్య 3వేల రూపాయాల బాకీ విషయంలో వివాదం తలెత్తింది. తన డబ్బులు తిరిగి ఇవ్వడంలేదనే కసితో దుర్గారావు కొబ్బరికాయలు కొట్టే కత్తితో ఉదయ్ కిరణ్ పై దాడిచేసాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఉదయ్ కిరణ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గతంలో అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వడంలో ఆలస్యమైతే వారిపై దారుణంగా దాడులు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే ఇపుడు ఏకంగా ఒకరినొకరు చంపుకోవడం ఆందోళణ కలిగిస్తోంది. చిన్నచిన్న బాకీలు తీర్చకపోవడంతో ఏకంగా కత్తులతో దాడులు చేసి ప్రాణాలు తీస్తున్నారు. దీంతో అటు అప్పు తీసుకున్న వారి కుటుంబాలు, ఇటు అప్పు ఇచ్చిన వారి కుటుంబాలు మరింతగా నష్టపోతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా పోలిసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Read Also: Jagadish Reddy : గుజరాత్లో వ్యవసాయానికి 6 గంటల విద్యుత్ మాత్రమే
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!