Vikram Reddy: సీఎం జగన్ ని కలిసిన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. ఆయనతో పాటు మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన మేకపాటి విక్రమ్ రెడ్డి సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికయిన విక్రమ్ రెడ్డి, పార్టీ నేతలను అభినందించారు సీఎం వైఎస్ జగన్. ఇటీవల జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో విక్రమ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. క్యాంపు కార్యాలయానికి వచ్చిన మేకపాటి విక్రమ్ రెడ్డిని వైసీపీ నేతలు అభినందించారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ, వైసీపీ అభ్యర్ధులే ప్రధానంగా తలపడ్డారు.మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక నిర్వహించారు.
ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీకి 1,02,240 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ 19,352 ఓట్లే వచ్చాయి. ఆత్మకూరులో బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది. వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్రెడ్డి 82,888 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొత్తం 20 రౌండ్లకు గానూ రౌండ్ రౌండ్కు మేకపాటి విక్రమ్రెడ్డి ఆధిక్యం పెరుగుతూనే వచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ వైఎస్ఆర్ సీపీ ఆధిక్యం కనబరచిన సంగతి తెలిసిందే. తిరుపతి, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ వరుస ఓటములు చవిచూసింది. గత సంప్రదాయాలకు అనుగుణంగా టీడీపీ ఆత్మకూరులో పోటీచేయలేదు.
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్రెడ్డికి ఘన విజయాన్ని అందించిన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. “ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్కు నివాళిగా.. ఆత్మకూరులో 83 వేల భారీ మెజార్టీతో విక్రమ్ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి.. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు.. పేరుపేరునా ధన్యవాదాలు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష“ అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
-
PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!