Vikram Reddy: సీఎం జగన్ ని కలిసిన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. ఆయనతో పాటు మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన మేకపాటి విక్రమ్ రెడ్డి సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికయిన విక్రమ్ రెడ్డి, పార్టీ నేతలను అభినందించారు సీఎం వైఎస్ జగన్. ఇటీవల జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో విక్రమ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. క్యాంపు కార్యాలయానికి వచ్చిన మేకపాటి విక్రమ్ రెడ్డిని వైసీపీ నేతలు అభినందించారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ, వైసీపీ అభ్యర్ధులే ప్రధానంగా తలపడ్డారు.మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక నిర్వహించారు.
ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీకి 1,02,240 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ 19,352 ఓట్లే వచ్చాయి. ఆత్మకూరులో బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది. వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్రెడ్డి 82,888 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొత్తం 20 రౌండ్లకు గానూ రౌండ్ రౌండ్కు మేకపాటి విక్రమ్రెడ్డి ఆధిక్యం పెరుగుతూనే వచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ వైఎస్ఆర్ సీపీ ఆధిక్యం కనబరచిన సంగతి తెలిసిందే. తిరుపతి, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ వరుస ఓటములు చవిచూసింది. గత సంప్రదాయాలకు అనుగుణంగా టీడీపీ ఆత్మకూరులో పోటీచేయలేదు.
Also Read
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్రెడ్డికి ఘన విజయాన్ని అందించిన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. “ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్కు నివాళిగా.. ఆత్మకూరులో 83 వేల భారీ మెజార్టీతో విక్రమ్ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి.. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు.. పేరుపేరునా ధన్యవాదాలు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష“ అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!