TDP Atchannaidu: ఏపీ వాలంటీర్ వ్యవస్థపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం: అచ్చెన్నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని టీడీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘంతో మంగళవారం సమావేశమైంది. ఈసీతో భేటీ అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీలో దొంగ ఓట్ల చేర్పులు, ఓట్ల తొలగింపులు, టీడీపీ ఓట్లు టార్గెట్ గా తొలగించడం, వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించడం వంటి అంశాలపై ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ‘అక్టోబర్ 27 వరకు ఓటర్ వెరిఫికేషన్ దేశమంతట జరిగింది. కానీ ఏపీ రాష్ట్రంలో మాత్రం ఓటర్ వెరిఫికేషన్ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నిర్వహణ అంతా కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరుగుతుంది.
ఏపీలో కొత్త ఓట్లు నమోదు చేసుకోవడానికి ఫారం సిక్స్ ఓటు తొలగించుకోవడానికి ఫారం సెవెన్ ఉంది. ఓటర్కి సమాచారం ఇవ్వకుండానే ఓట్లను తొలగిస్తూన్నారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. కుటుంబంలో నలుగురు ఉంటే.. నాలుగురు ఓట్లను వివిద బూతుల్లో చేర్చారు. ఒకే కుటుంబంలో ఉన్న ఓట్లను ఇష్టానుసారంగా మార్పులు చేశారు. ఒకే మనిషికి రెండు ఓట్లు ఉన్నాయి వాటికి సంబంధించిన ఆధారాలను రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇచ్చాము. వాలంటరీ వ్యవస్థను ఉపయోగించి టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారు. ఈ అంశానికి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపాం’ అన్నారు. ‘160 పోలింగ్ స్టేషన్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. వీటిని మార్పు చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు చెప్పాం. కానీ, దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
Also Read
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
రాష్ట్ర ప్రభుత్వం వై నీడ్స్ జగన్ అని కార్యక్రమం పెట్టారు, దాంట్లో గ్రామ సచివాలయం అధికారులను నియమించారు. ఏపీ రాష్ట్రంలో జగన్ సొంత వ్యవస్థను ఉపయోగించి ఎన్నికలు జరుపుతున్నారు. గ్రామ సచివాలయం ఉద్యోగులను వచ్చే ఎన్నికల్లో విధుల్లో నియమించవద్దని ఈసీకి విజ్ఞప్తి చేశాము. అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులను వైసీపీ నేతలు చెప్పినట్టు చేయకపోతే వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. కేంద్ర సర్వీసులో ఉన్న అధికారులను ఏపీలోని జిల్లాలకు ఇంచార్జ్లుగా నియమించాలి. అధికారులు ఓటర్ లిస్ట్ తనిఖీ చేయాలని కోరాం. చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు‘ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో అచ్చెన్నాయుడుతో పాటు కనకమేడల రవీంద్ర కుమార్, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బోండా ఉమ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?