TDP Atchannaidu: ఏపీ వాలంటీర్ వ్యవస్థపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం: అచ్చెన్నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని టీడీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘంతో మంగళవారం సమావేశమైంది. ఈసీతో భేటీ అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీలో దొంగ ఓట్ల చేర్పులు, ఓట్ల తొలగింపులు, టీడీపీ ఓట్లు టార్గెట్ గా తొలగించడం, వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించడం వంటి అంశాలపై ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ‘అక్టోబర్ 27 వరకు ఓటర్ వెరిఫికేషన్ దేశమంతట జరిగింది. కానీ ఏపీ రాష్ట్రంలో మాత్రం ఓటర్ వెరిఫికేషన్ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నిర్వహణ అంతా కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరుగుతుంది.
ఏపీలో కొత్త ఓట్లు నమోదు చేసుకోవడానికి ఫారం సిక్స్ ఓటు తొలగించుకోవడానికి ఫారం సెవెన్ ఉంది. ఓటర్కి సమాచారం ఇవ్వకుండానే ఓట్లను తొలగిస్తూన్నారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. కుటుంబంలో నలుగురు ఉంటే.. నాలుగురు ఓట్లను వివిద బూతుల్లో చేర్చారు. ఒకే కుటుంబంలో ఉన్న ఓట్లను ఇష్టానుసారంగా మార్పులు చేశారు. ఒకే మనిషికి రెండు ఓట్లు ఉన్నాయి వాటికి సంబంధించిన ఆధారాలను రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇచ్చాము. వాలంటరీ వ్యవస్థను ఉపయోగించి టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారు. ఈ అంశానికి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపాం’ అన్నారు. ‘160 పోలింగ్ స్టేషన్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. వీటిని మార్పు చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు చెప్పాం. కానీ, దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
Also Read
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
రాష్ట్ర ప్రభుత్వం వై నీడ్స్ జగన్ అని కార్యక్రమం పెట్టారు, దాంట్లో గ్రామ సచివాలయం అధికారులను నియమించారు. ఏపీ రాష్ట్రంలో జగన్ సొంత వ్యవస్థను ఉపయోగించి ఎన్నికలు జరుపుతున్నారు. గ్రామ సచివాలయం ఉద్యోగులను వచ్చే ఎన్నికల్లో విధుల్లో నియమించవద్దని ఈసీకి విజ్ఞప్తి చేశాము. అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులను వైసీపీ నేతలు చెప్పినట్టు చేయకపోతే వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. కేంద్ర సర్వీసులో ఉన్న అధికారులను ఏపీలోని జిల్లాలకు ఇంచార్జ్లుగా నియమించాలి. అధికారులు ఓటర్ లిస్ట్ తనిఖీ చేయాలని కోరాం. చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు‘ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో అచ్చెన్నాయుడుతో పాటు కనకమేడల రవీంద్ర కుమార్, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బోండా ఉమ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!