Asani Cyclone: బలహీనపడిన ‘అసని’.. అయినా అప్రమత్తంగానే ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ బలహీనపడుతోంది. మచిలీపట్నానికి సమీపంలో తీవ్ర వాయుగుండంగా నుంచి బలహీనపడి వాయుగుండంగా మారినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. మరికొద్ది గంటల తర్వాత ఇదే ప్రాంతంలో తిరుగుతూ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Breaking: తీరం దాటిన అసని తుఫాన్
Also Read
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
- Ram Mohan Naidu: 'పీ4' విధానంలో శ్రీకాకుళం జిల్లాకు 'ఎ' గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
వాయుగుండం కారణంగా తీరం వెంబడి గంటకు 45- 55కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. అసని తుఫాన్ బలహీనపడినప్పటికీ ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసర సాయం కోసం 1070 హెల్ప్ లైన్ నంబరుకు కాల్ చేయాలన్నారు.
మరోవైపు అసని తుఫాన్ బలహీనపడుతున్నా.. దాని ప్రభావంతో గురువారం, శుక్రవారాల్లో తెలంగాణలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నాడు రాష్ట్రంలో 82 చోట్ల మోస్తరు వర్షాలు కురిసినట్లు వెల్లడించింది. మంచిర్యాల జిల్లా కొత్తపల్లిలో అత్యధికంగా 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. కాగా హైదరాబాద్లో గత రెండు రోజుల్లో 10 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత తగ్గింది.
తాజావార్తలు
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!