నరేంద్రమోదీ షా ఈ ఇద్దరు దేశాన్ని అమ్మేస్తున్నారు : శైలజానాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నరేంద్రమోదీ షా ఈ ఇద్దరు దేశాన్ని అమ్మేస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. భారత్ ను కొద్దిమంది వ్యక్తులకు అమ్మివేసే బీజేపీ నేతలు దేశ ద్రోహులు అని ఆయన ఆరోపించారు. అడవులను అటవీ సంపదను, లాభాల్లో ఉన్న ఎల్ఐసీని, రైల్వే ను విమానాలను అమ్మేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజులు పరిపాలించాలి, డబ్బు అంతా బడా బాబుల వద్ద ఉండాలన్న విధంగా ఈ బడ్జెట్ ఉందని ఆయన అన్నారు. అదాని అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు బీజేపీ ఊడిగం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై నోరు విప్పడానికి కూడా సీఎం జగన్ కు ధైర్యం లేదని, రాష్ర్టానికి అన్యాయం జరుగుతున్నా.. వైసీపీ ఎంపీలు ఒక్క మాట మాట్లాడటం లేదని ఆయన ధ్వజమెత్తారు.
అంతా తెలుకుట్టిన దొంగల్లా ఉన్నారని, వైసీపీ ఎంపీలు మేలుకున్నారో..? పడుకున్నారో..? అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఎంపీలకు ఎమ్మెల్యే లకు రెండు విషయాల్లో పర్మిషన్ ఇచ్చారని, ల్యాండ్ మాఫియా చేయమని, స్టిక్కర్లు వేసుకొని తిరగమని ఇచ్చారని ఆయన అన్నారు. 10వ తేదీ నుంచి అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఆయన స్పష్టం చేశారు.
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?