Gidugu Rudraraju: వర్మని బట్టలూడదీసి కొడతాం.. ఏపీ పీసీసీ చీఫ్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APPCC Chief Gidugu Rudraraju Gives Strong Warning To Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీసీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వర్మ తీస్తున్న వ్యూహం సినిమాలో సోనియా గాంధీని చెడుగా చూపిస్తే.. వర్మని బట్టలూడదీసి కొడతామని హెచ్చరించారు. అసలు వాస్తవాలేంటో వర్మకి తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. తమ సోనియాను గానీ, చరిత్రను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తే గానే.. చూస్తూ ఊరుకునేలేదే లేదని ధ్వజమెత్తారు. ‘వర్మ.. ఖబడ్దార్’ అంటూ విరుచుకుపడ్డారు. వ్యూహం టీజర్ చూసిన అనంతరం.. గిడుగు రుద్రరాజు ఈ స్థాయిలో వర్మపై విరుచుకుపడ్డారు. ఇక ఇదే సమయంలో.. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు, సిద్దాంతాలకు కట్టుబడి ఎవరూ వచ్చిన తాము స్వాగతిస్తామని స్పష్టతనిచ్చారు. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ మహానాయకుడని చెప్పిన ఆయన.. గాంధీ భవన్లో సీఎల్పీ సమావేశం జరిగినప్పుడు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలనేది ఆయన చివరి కోరిక అని రాజశేఖరరెడ్డి చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. ఆయన కోరికను నెరవేర్చడం కోసమే తాము పార్టీలో పని చేస్తున్నామని.. ఆ కోరికలో భాగస్వామురాలిగా షర్మిల కూడా వచ్చి పనిచేస్తే తప్పకుండా పార్టీలోకి స్వాగతిస్తామని తెలిపారు.
LML Star: ఈ స్కూటీకి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే.. 225 కి.మీ వెళ్లొచ్చు..
Also Read
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
అంతకుముందు.. తమ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వస్తే, ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తామని గిడుగు రుద్రరాజు హామీ ఇచ్చారు. దేశంలో, రాష్ట్రంలో సంక్షేమ పాలన కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. వైయస్ జగన్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా కడప ఉక్కు పరిశ్రమ ఊసే లేదని ఆరోపించారు. చెన్నూరు చక్కెర కర్మాగారం తెరిపిస్తానని హామీ ఇచ్చిన జగన్.. దానికి అతీగతీ లేకుండా చేశారన్నారు. ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తామని చెప్పారు కానీ.. జిల్లాలో ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని రుద్రరాజు మండిపడ్డారు.
Project k : సినిమాలో కమల్ హాసన్ నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన మేకర్స్..
తాజావార్తలు
-
Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
-
Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Box Office : సెప్టెంబర్లో సినిమా జాతర.. గెలిచేది ఎవరు.?
-
NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!