APERC: విద్యుత్ వినియోగదారులకు గుడ్న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APERC: ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ వినియోగదారులు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ).. ఇప్పట్లో వినియోగదారులపై విద్యుత్ బిల్లుల భారం ఉండబోదని స్పష్టం చేసింది.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ టారిఫ్ వివరాలను ప్రకటించారు ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి.. ఆ వివరాల ప్రకారం ఈ ఏడాది విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం ఉండబోదన్న మాట.. ఇక, ఈ సందర్భంగా జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల సబ్సిడీ కొనసాగుతుందని స్పష్టం చేశారు.. మరోవైపు.. నాయి బ్రహ్మణులు, ఆక్వా రంగం విద్యుత్ రాయితీలను ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు.. రాయితీల రూపంలో ఏపీ ప్రభుత్వం రూ. 10,135 కోట్ల వరకు భరిస్తుందని వెల్లడించారు.. అయితే, ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అంశం మీద మాత్రమే చార్జీలు పెంచుతున్నామని క్లారిటీ ఇచ్చారు ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి.
Read Also: Rain in Andhra Pradesh: ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు..
Also Read
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
కాగా, టారిఫ్ను దాదాపు స్థిరంగా ఉంచాలన్న పవన విద్యుత్ డెవలపర్ల అభ్యర్థనను తోసిపుచ్చుతూ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC) 11-20 సంవత్సరాల కాలానికి తక్కువ స్లాబ్లో టారిఫ్ను నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి.. ప్రాజెక్ట్ల ఇన్స్టాలేషన్ మరియు కమీషన్ తర్వాత మొదటి 10 సంవత్సరాలకు పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ (PPA) గడువు ముగిసిన తర్వాత, డెవలపర్లు తదుపరి 10 సంవత్సరాలకు యూనిట్కు రూ.3.43గా టారిఫ్ను నిర్ణయించాలని APERCకి ప్రాతినిధ్యాన్ని సమర్పించారు. డెవలపర్లు మొదటి 10 సంవత్సరాలకు యూనిట్కు రూ.3.50 పొందారు. టారిఫ్లో లోతైన స్లాష్ను ఊహించి, డెవలపర్లు ప్రాజెక్ట్ ఖర్చులను కొనసాగించడానికి టారిఫ్ను కొద్దిగా తగ్గించి, యూనిట్కు రూ.3.43గా నిర్వహించాలని APERCని అభ్యర్థించారు. ఇక, APERC 11-20 సంవత్సరాల పదవీకాలం నుండి యూనిట్కు రూ.2.64గా టారిఫ్ను నిర్ణయించింది. ERC ఆమోదించిన టారిఫ్ డెవలపర్లు కోరిన ధర కంటే దాదాపు 79 పైసలు తక్కువ మరియు ఇప్పటికే ఉన్న టారిఫ్ కంటే దాదాపు 0.86 పైసలు తక్కువ అన్నమాట.. ప్రారంభ దశలో గ్రీన్ పవర్ డెవలపర్లను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో మొదటి పదేళ్లపాటు అధిక టారిఫ్లను అనుమతించినట్లు APERC స్పష్టం చేసింది. టెక్నాలజీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అంతిమంగా ప్రజలపై డిస్కమ్లపై భారం మోపలేమని కమిషన్ పేర్కొంది. తాజా సాంకేతికతలు పవర్ మిల్లుల నిర్వహణ వ్యయాలను భారీగా తగ్గించాయని, అందువల్ల అధిక టారిఫ్కు ఆమోదం తెలిపే ప్రసక్తే లేదని గతంలోనే కమిషన్ స్పష్టం చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Petrol-Diesel: పెట్రోల్లో ఇథనాలు, డీజిల్లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
-
Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
-
Tejashwi Yadav: బ్యాలెట్తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!