APERC: విద్యుత్ వినియోగదారులకు గుడ్న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APERC: ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ వినియోగదారులు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ).. ఇప్పట్లో వినియోగదారులపై విద్యుత్ బిల్లుల భారం ఉండబోదని స్పష్టం చేసింది.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ టారిఫ్ వివరాలను ప్రకటించారు ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి.. ఆ వివరాల ప్రకారం ఈ ఏడాది విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం ఉండబోదన్న మాట.. ఇక, ఈ సందర్భంగా జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల సబ్సిడీ కొనసాగుతుందని స్పష్టం చేశారు.. మరోవైపు.. నాయి బ్రహ్మణులు, ఆక్వా రంగం విద్యుత్ రాయితీలను ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు.. రాయితీల రూపంలో ఏపీ ప్రభుత్వం రూ. 10,135 కోట్ల వరకు భరిస్తుందని వెల్లడించారు.. అయితే, ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అంశం మీద మాత్రమే చార్జీలు పెంచుతున్నామని క్లారిటీ ఇచ్చారు ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి.
Read Also: Rain in Andhra Pradesh: ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు..
Also Read
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
కాగా, టారిఫ్ను దాదాపు స్థిరంగా ఉంచాలన్న పవన విద్యుత్ డెవలపర్ల అభ్యర్థనను తోసిపుచ్చుతూ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC) 11-20 సంవత్సరాల కాలానికి తక్కువ స్లాబ్లో టారిఫ్ను నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి.. ప్రాజెక్ట్ల ఇన్స్టాలేషన్ మరియు కమీషన్ తర్వాత మొదటి 10 సంవత్సరాలకు పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ (PPA) గడువు ముగిసిన తర్వాత, డెవలపర్లు తదుపరి 10 సంవత్సరాలకు యూనిట్కు రూ.3.43గా టారిఫ్ను నిర్ణయించాలని APERCకి ప్రాతినిధ్యాన్ని సమర్పించారు. డెవలపర్లు మొదటి 10 సంవత్సరాలకు యూనిట్కు రూ.3.50 పొందారు. టారిఫ్లో లోతైన స్లాష్ను ఊహించి, డెవలపర్లు ప్రాజెక్ట్ ఖర్చులను కొనసాగించడానికి టారిఫ్ను కొద్దిగా తగ్గించి, యూనిట్కు రూ.3.43గా నిర్వహించాలని APERCని అభ్యర్థించారు. ఇక, APERC 11-20 సంవత్సరాల పదవీకాలం నుండి యూనిట్కు రూ.2.64గా టారిఫ్ను నిర్ణయించింది. ERC ఆమోదించిన టారిఫ్ డెవలపర్లు కోరిన ధర కంటే దాదాపు 79 పైసలు తక్కువ మరియు ఇప్పటికే ఉన్న టారిఫ్ కంటే దాదాపు 0.86 పైసలు తక్కువ అన్నమాట.. ప్రారంభ దశలో గ్రీన్ పవర్ డెవలపర్లను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో మొదటి పదేళ్లపాటు అధిక టారిఫ్లను అనుమతించినట్లు APERC స్పష్టం చేసింది. టెక్నాలజీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అంతిమంగా ప్రజలపై డిస్కమ్లపై భారం మోపలేమని కమిషన్ పేర్కొంది. తాజా సాంకేతికతలు పవర్ మిల్లుల నిర్వహణ వ్యయాలను భారీగా తగ్గించాయని, అందువల్ల అధిక టారిఫ్కు ఆమోదం తెలిపే ప్రసక్తే లేదని గతంలోనే కమిషన్ స్పష్టం చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్కు ఊహించని షాక్!
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
-
RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!