Rajyasabha Elections: ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ ఎంపీలుగా వైసీపీ నుంచి నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సెక్రటరీ చేతుల మీదుగా డిక్లరేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారు విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, కృష్ణయ్య, బీద మస్తాన్ రావు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డిని తిరిగి రెండోసారి ఎంపికచేశారు సీఎం జగన్. అలాగే బీసీ వర్గానికి చెందిన ఆర్.కృష్ణయ్య, బీదా మస్తాన్రావు, సుప్రీంకోర్టులో న్యాయవాది ఎస్,నిరంజన్రెడ్డిలకు జగన్ అవకాశం ఇచ్చారు. వీరిలో ఇద్దరు రాష్ట్రానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు కావడం విశేషం.
తాను తెలంగాణలోనే పోరాడలేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న బీసీల అభివృద్ధి కోసం పని చేస్తున్నానని రాజ్యసభకు ఎన్నికైన కృష్ణయ్య అంటున్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలంటే తెలంగాణకే కాకుండా దేశంలో అందరి కోసం రిజర్వేషన్లు ఉండాలన్నారు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని రాజ్యసభలో కొట్లాడతానని చెప్పారు.
Also Read
- Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో 'అవిగన్' తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
- Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్బోన్క్లాస్ అని నమ్మిన సీఎం ఆచరణలో చేసి చూపించారు. బీసీల సమస్యలపై జీవితమంతా ఆర్ కృష్ణయ్య పోరాటం చేశారని వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు. రెండవసారి తనకు అవకాశం ఇచ్చిన జగన్ కి ధన్యవాదాలు తెలిపారు విజయసాయిరెడ్డి. వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న విజయసాయికి రెండవసారి అవకాశం ఇస్తారని ముందునుంచే అంతా భావించారు. కానీ ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలకు అవకాశం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముందునుంచీ తనతో సన్నిహితంగా మెలిగిన నటుడు అలీకి అవకాశం ఇస్తారని భావించారు. కానీ అలా జరగలేదు.
అలీకి నామినేటెడ్ పదవిని కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి సైతం సీఎం అవకాశం ఇవ్వకపోవడంతో ఆమె అసహనంతో వున్నారు. గతంలో రిలయెన్స్ నుంచి పరిమళ్ నత్వానికి అవకాశం ఇచ్చినట్టు ఈసారి అదానీ కుటుంబీకులకు పదవి కట్టబెడతారని భావించారంతా. కానీ అలా జరగలేదు. మొత్తం మీద ఈసారి రాజ్యసభ ఎన్నికలు ఊహించిన దానికంటే భిన్నంగా జరిగాయి. నలుగురు సభ్యుల ఎంపికతో రాజ్యసభలో వైసీపీ సభ్యుల బలం పెరిగింది.
తాజావార్తలు
-
India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
-
2027 World Cup: వన్డే వరల్డ్ కప్కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
-
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!