పేద, మధ్య తరగతి వర్గాల కోసం కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశమైంది.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కేబినెట్.. ఇక, కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని.. తీసుకున్న నిర్ణయాలను విరించారు.. పేద, మధ్య తరగతి వర్గాల కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం అన్నారు.. రైతులకు ఉదయం 9 గంటల పాటు ఉచిత విద్యుత్ కోసం 10 వేల మెగావాట్ల విద్యుత్ను యూనిట్ రూ.2.49కు 30 ఏళ్ల పాటు ఇచ్చేందుకు కేంద్ర సోలార్ కార్పొరేషన్ ముందుకు వచ్చిందని.. దీనికి మంత్రి మండలి ఆమోద ముద్ర వేసిందన్నారు.. కేంద్ర సోలార్ కార్పొరేషన్ ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తు లేఖ రాసిందని ఈ సందర్భంగా వెల్లడించిన మంత్రి.. మాజీ సీఎం చంద్రబాబు చేసిన పాపం, అవినీతినే ట్రూ అప్ ఛార్జీల పేరుతో రాష్ట్రం భరించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
ఇక, మైనార్టీ సబ్ ప్లాన్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.. మైక్రోసాఫ్ట్ సహకారంతో 1.62 లక్షల మంది విద్యార్ధులకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.. 300 కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో శిక్షణ ఇవ్వనుంది మైక్రోసాఫ్ట్.. 40 సర్టిఫికేషన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు.. రూ. 30.79 కోట్లతో మైక్రో సాఫ్ట్ ప్రాజెక్టు అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. డ్రగ్స్ అండ్ కాస్మటెక్స్ చట్టానికి సవరణలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.. నకిలీ, ప్రజలకు హాని చేసే మందులు అమ్మేవారిపై చర్యలు తీసుకునే అవకాశం ఈ చట్ట సవరణ ద్వారా కలగనుంది.. మరోవైపు.. గుంటూరు జిల్లాలోని 230 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఎమ్డీసీకి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్.. ఆ భూముల్లో ఇప్పటికే ఉన్న పేదవారికి నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే బదలాయింపు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది.. 1983 నుంచి 2011 వరకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర ఇంటి పట్టాలు కుదువ పెట్టి తెచ్చుకున్న అప్పును ఒన్ టైం సెటిల్ మెంట్ పథకం అమలు చేయాలని కేబినెట్ తీర్మానం చేసినట్టు వెల్లడించార మంత్రి పేర్నినాని.. పేద, మధ్య తరగతి వర్గాల కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామన్న ఆయన.. దీని వల్ల 46 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు.. గ్రామీణ ప్రాంతాల్లో 10 వేలు, మున్సిపాలిటీల్లో 15 వేలు, నగరాల్లో 20 వేలు కట్టి రుణ విముక్తులు అవ్వొచ్చని సూచించారు. ఈ ఏడాది డిసెంబర్ 21లోపు ఈ పథకాన్ని ఉపయోగించుకునే సౌలభ్యం ఉందని తెలిపిన మంత్రి.. అసలు, వడ్డీ కలిపి రూ.14 వేల 600 కోట్లు ఒన్ టైం సెటిల్ మెంట్ కింద అమలు చేస్తామన్నారు.. ఇక, 31 లక్షల మందికి సొంత ఇంటి స్థలం కేటాయించామని.. వీరికి బ్యాంకుల నుంచి 9 శాతం వడ్డీకి 35వేలు రుణ సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని.. దీనిలో 6 శాతం వడ్డీ ప్రభుత్వం బరిస్తుందన్నారు. ఒక్క పోలీసు స్టేషన్లేని ఏకైక మండలం కాసినాయన మండలంలో ఒక లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్, సిబ్బంది ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని.. ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇక, రెవెన్యూ డివిజన్ గా బద్వేలు ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని వెల్లడించారు మంత్రి పేర్నినాని.
Also Read
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
- National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
తాజావార్తలు
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!