అక్రమ మైనింగ్ నియంత్రిస్తే 20 శాతం రెవెన్యూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైనింగ్ పై సమీక్ష నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై జిల్లాల వారీగా అవుట్సోర్సింగ్ ద్వారా సీనరేజీ కలెక్షన్స్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు.. ఈ విధానం వల్ల అదనంగా 35 నుంచి 40 శాతం సీనరేజీ ప్రభుత్వానికి జమ అవుతుందని అంచనా ఉందన్నారు.. వాల్యూమెట్రిక్ కు బదులు వెయిట్ బేసిస్ లో సీనరేజీ వసూళ్ళకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.. అక్రమ మైనింగ్, రవాణాను నియంత్రించగలిగితే 15 నుంచి 20 శాతం రెవెన్యూ పెరుగుతుందని అంచనా వేసిన ఆయన.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మైనింగ్ సీనరేజీ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.1643 కోట్లు అని వెల్లడించారు.. ఇక, జగనన్న కాలనీలకు ఉచిత ఇసుక కోసం ప్రత్యేక కూపన్లు జారీ చేయాలనిన్నారు మంత్రి పెద్దిరెడ్డి.. మైనర్ మినరల్స్ లీజులన్నీ ఈ-యాక్షన్ ద్వారా కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలన్న ఆయన.. మైనర్ మినరల్స్ ఈ- యాక్షన్ ద్వారా 2020-21లో రూ.476 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని అంచనా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు.. శాస్త్రీయ విధానంలో మైనింగ్ లీజుల పెంపుదలకు యోచన చేయాలని.. ఇప్పటికే 21,577 హెక్టార్లలో లీజుల కోసం 2,694 దరఖాస్తులు వచ్చినట్టు పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..