శాశ్వతంగా అదానీ చేతికి గంగవరం పోర్టు..! క్లారిటీ ఇచ్చిన మంత్రి మేకపాటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గంగవరం పోర్టులోని ప్రభుత్వ వాటాలను తమకు అప్పగించాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది అదానీ గ్రూప్.. దీనిపై అధ్యయనానికి ఉన్నతస్థాయిలో అధికారులతో కమిటీ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. దీంతో.. గంగవరం పోర్టు శాశ్వతంగా అదానీ గ్రూప్కు వెళ్లిపోతుందనే ప్రచారం ఊపందుకుంది.. దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి.. గంగవరం పోర్టు శాశ్వతంగా అదానీ సంస్థకు వెళ్లి పోతుందన్నది అవాస్తవం అన్నారు.. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం అప్పటి నుంచి 50 ఏళ్ల వరకు ప్రైవేటు భాగస్వామ్య సంస్థకు హక్కులు ఉంటాయని స్పష్టం చేసిన ఆయన.. ఒప్పంద కాలం పూర్తి అయిన తర్వాత అంటే 36 ఏళ్ల తర్వాత గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని క్లారిటీ ఇచ్చారు.. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రచారం కోసం పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించిన మంత్రి గౌతమ్రెడ్డి… వాస్తవంగా వచ్చిన పెట్టుబడులు 10 శాతమే అన్నారు.. కానీ, మేం వాస్తవంగా వచ్చే పెట్టుబడుల లెక్కలనే చెబుతున్నాం… టీడీపీలా మభ్యపెట్టే ప్రయత్నం చేయటం లేదన్నారు.
మరోవైపు మొత్తం ఎస్జీడీపీలో 35శాతం వ్యవసాయం, 23 శాతం పారిశ్రామిక రంగానిదని.. దేశం మొత్తం ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 10 శాతం పెంచాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి… మూడు పారిశ్రామిక కారిడార్లు రాష్ట్రంలోని 13 జిల్లాల గుండా వెళ్తున్నాయని విరించిన ఆయన.. అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నంలో మూడు కాన్సెప్ట్ సిటీలు వస్తున్నాయన్నారు.. ఏపీలో 2019లో 34, 696 కోట్లు, 2020లో 9,840 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. ఇదే కాలానికి తెలంగాణలో సగటున ఈ రెండేళ్లలో 6, 7 వేల కోట్ల పెట్టుబడులే వచ్చినట్టు వెల్లడించారు. మౌలిక సదుపాయాలు ఉంటే పరిశ్రమలు వాటంతట అవే వస్తాయి అన్న ముఖ్యమంత్రి ఆలోచన దిశగా ప్రభుత్వ ఆచరణలో పెడుతుందని తెలిపారు.. మా ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మూడవ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి జరుగుతోందని.. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఘనత కూడా మా ప్రభుత్వానిదే అన్నారు.
Also Read
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- OTR : జనసేన ఎమ్మెల్యే మరింత చిక్కుల్లో పడబోతున్నాడా?
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!