AP High Court : టీటీడీ బోర్డు మెంబర్లపై ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీటీడీ బోర్డు మెంబర్లలో క్రిమినల్ కేసులు ఉన్నవారు, ప్రత్యేక ఆహ్వానితులు ఎక్కువ మంది ఉన్నారని వేసిన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే టీటీడీ బోర్డు మెంబర్లు 18 మందిలో ఇద్దరు మాత్రమే కౌంటర్ దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా దాఖలు చేయని వారిని కూడా కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయకుంటే విచారణ కొనసాగిస్తామని హై కోర్టు స్పష్టం చేసింది. ఆర్డినెన్స్ తెచ్చిన తరువాత జీవో ఇవ్వనందున ఆర్డినెన్స్ చెల్లదని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదించారు. దీంతో ఆర్డినెస్స్ పై ప్రత్యేకంగా పిటిషన్ వేయమని పిటిషనరుకు ధర్మాసనం సూచించింది.
జీవోపై హై కోర్టు ఇచ్చిన స్టే పై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో భూమనకు మాత్రమే ప్రత్యేక ఆహ్వానితునిగా వుండేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. భూమన కరుణాకరెడ్డి వేసిన ఇంప్లీడ్ పిటీషన్ విచారణకు అనుమతించద్దని పిటిషనర్ తరుపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అయితే భూమన స్వప్రయోజనం కోసమే ఇంప్లీడ్ పిటీషన్ వేశారన్న పిటీషనర్ తరుపు న్యాయవాది కోర్టు వివరించారు. ప్రభుత్వం మెమో కాపీ అందిన తరువాత కౌంటర్ దాఖలు చేస్తామని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. తాము కౌంటర్ వేసే వరకు స్టే వెకేట్ చేయవద్దని ధర్మాసనాన్ని పిటిషనర్ తరుపు న్యాయవాది కోరారు. మెమో కాపీ అడిగి తీసువాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ మార్చి 11కు వాయిదా వేసింది.
Also Read
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
తాజావార్తలు
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!