Ap Temples: స్టాళ్ళలో ధరల నియంత్రణకు చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలోని వేలాది దేవాలయాల సమీపంలో స్టాళ్ళ ద్వారా భక్తులకు కావాల్సిన కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, పూలు, అరటిపళ్ళు విక్రయిస్తూ వుంటారు. అయితే రేట్లు అధికంగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏపీలో దేవాలయాల సమీపంలోని స్టాళ్లల్లో ధరలను కంట్రోల్ చేసేందుకు ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి దేవస్థానాల సమీపంలోని స్టాళ్లల్లో ధరలను నియంత్రించేలా దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ సర్కులర్ జారీచేశారు. దేవాలయ ప్రాంగణంలోని లైసెన్స్ కలిగిన షాపుల్లో ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు జరిగేలా చూడాలని ఈవోలకు ఆదేశం ఇచ్చారు.
కొబ్బరి కాయలు, పూలు, పళ్లు, తినుబండారాల ధరలను ఈవోనే నిర్దేశించాలని స్పష్టీకరణ. దుకాణదారులతో చర్చించి ధరలను నిర్ధారించాలని సూచించారు. దేవాలయాలకు వచ్చే భక్తులతో ఎలా వ్యవహరించాలన్న అంశం పైనా దుకాణదారులకు అవగాహన కల్పించాలని దేవాదాయ శాఖ. భక్తులతో దురుసుగా ప్రవర్తించినా.. ఎక్కువ ధరలకు అమ్మినా లైసెన్సులు రద్దు చేస్తామనే విషయాన్ని టెండర్, ఆక్షన్ నిబంధనల్లో పొందుపరచాలని దేవాదాయ శాఖ తెలిపింది.
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
దేవాలయాల సమీపంలోని ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేసుకునే స్టాళ్లల్లోనూ ధరల నియంత్రణపై దృష్టి సారించాలంది దేవాదాయ శాఖ. ప్రైవేట్ స్టాళ్లల్లో ధరల నియంత్రణకు పౌర సరఫరాల శాఖ సాయం తీసుకోవాలని కమిషనర్ సూచనలు చేశారు. పూర్తి స్థాయి పర్యవేక్షణ నిమిత్తం విజిలెన్స్ వింగ్ ఏర్పాటు చేసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!