జీవనాధారం తాగునీరు. ఏ జీవి అయినా ముందుగా తాగేందుకు నీటి కోసం చూస్తుంది. మనుషులైతే నీరు ఎక్కడ దొరుకుతుందోనని ఎదురుచూస్తుంటాడు. అల్లూరిసీతారామరాజు జిల్లా అరకులోయ పర్యాటకులకు స్వర్గథామం. అయితే అక్కడ వుండే స్థానికులకు మాత్రం ప్రకృతి అందాలు ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వవు. తాగేందుకు నీరుంటే వారికి చాలు. అరకులోయ మండలం బస్కీపంచాయతీ రంగినిగూడ గ్రామస్తుల దుస్థితి అంతా ఇంతా కాదు. తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క వారు పడుతున్న కష్టాలు అధికారులకు కనిపించడంలేదు. తాగునీటి సమస్య పరిష్కారం…
ఏపీలోని వేలాది దేవాలయాల సమీపంలో స్టాళ్ళ ద్వారా భక్తులకు కావాల్సిన కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, పూలు, అరటిపళ్ళు విక్రయిస్తూ వుంటారు. అయితే రేట్లు అధికంగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏపీలో దేవాలయాల సమీపంలోని స్టాళ్లల్లో ధరలను కంట్రోల్ చేసేందుకు ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి దేవస్థానాల సమీపంలోని స్టాళ్లల్లో ధరలను నియంత్రించేలా దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ సర్కులర్ జారీచేశారు. దేవాలయ ప్రాంగణంలోని లైసెన్స్ కలిగిన షాపుల్లో ఎమ్మార్పీ…