గంగవరం పోర్టులోని వాటాలు ఇవ్వండి.. ఏపీ సర్కార్ను కోరిన అదానీ గ్రూప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గంగవరం పోర్టులో క్రమంగా తన వాటాలను పెంచుకునే పనిలో పడిపోయింది అదానీ గ్రూప్.. తాజాగా, గంగవరం పోర్టులోని ప్రభుత్వ పెట్టుబడులను తమకు విక్రయించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.. అయితే, అదానీ గ్రూప్ ప్రతిపాదనల సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.. సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్ నేతృత్వంలో ఆరుగురు ఉన్నతాధికారులతో ఎంపవర్డ్ కమిటీ వేసింది సర్కార్.. కమిటీలో సభ్యులుగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ , న్యాయశాఖ కార్యదర్శి సునీత, ప్రభుత్వ రంగ సంస్థల కార్యదర్శి కెవీ రమణ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ ఉన్నారు.
కాగా, గంగవరం పోర్టులో ప్రభుత్వానికి 10.40 శాతం మేర వాటాలు ఉన్నాయి… ఒక్కో షేర్ ధర రూ. 120 చొప్పున అమ్మితే ప్రభుత్వానికి రూ. 645.1 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు.. అయితే, ఇప్పటికే గంగవరం పోర్టులో తమకున్న 58.10, 31.50 శాతం మేర వాటాలను అదానీ గ్రూపునకు అమ్మేశారు డీవీఎస్ రాజు, విండీ లేక్ సైడ్.. ఇక, డీవీఎస్ రాజు, విండీ లేక్ సైడ్ వాటాలను అదానీ గ్రూపునకు బదిలీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఏపీ మారిటైమ్ బోర్డు సిఫార్సుల మేరకు గంగవరం పోర్టును అదానీ సెజ్ లో విలీనం చేసేందుకు అంగీకరించింది.. ఇప్పుడు ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికారుల కమిటీ.. గంగవరం పోర్టులో వాటాల బదిలీ, ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణపై కూడా కసరత్తు చేయనుంది.
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!