గంగవరం పోర్టులోని వాటాలు ఇవ్వండి.. ఏపీ సర్కార్ను కోరిన అదానీ గ్రూప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గంగవరం పోర్టులో క్రమంగా తన వాటాలను పెంచుకునే పనిలో పడిపోయింది అదానీ గ్రూప్.. తాజాగా, గంగవరం పోర్టులోని ప్రభుత్వ పెట్టుబడులను తమకు విక్రయించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.. అయితే, అదానీ గ్రూప్ ప్రతిపాదనల సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.. సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్ నేతృత్వంలో ఆరుగురు ఉన్నతాధికారులతో ఎంపవర్డ్ కమిటీ వేసింది సర్కార్.. కమిటీలో సభ్యులుగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ , న్యాయశాఖ కార్యదర్శి సునీత, ప్రభుత్వ రంగ సంస్థల కార్యదర్శి కెవీ రమణ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ ఉన్నారు.
కాగా, గంగవరం పోర్టులో ప్రభుత్వానికి 10.40 శాతం మేర వాటాలు ఉన్నాయి… ఒక్కో షేర్ ధర రూ. 120 చొప్పున అమ్మితే ప్రభుత్వానికి రూ. 645.1 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు.. అయితే, ఇప్పటికే గంగవరం పోర్టులో తమకున్న 58.10, 31.50 శాతం మేర వాటాలను అదానీ గ్రూపునకు అమ్మేశారు డీవీఎస్ రాజు, విండీ లేక్ సైడ్.. ఇక, డీవీఎస్ రాజు, విండీ లేక్ సైడ్ వాటాలను అదానీ గ్రూపునకు బదిలీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఏపీ మారిటైమ్ బోర్డు సిఫార్సుల మేరకు గంగవరం పోర్టును అదానీ సెజ్ లో విలీనం చేసేందుకు అంగీకరించింది.. ఇప్పుడు ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికారుల కమిటీ.. గంగవరం పోర్టులో వాటాల బదిలీ, ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణపై కూడా కసరత్తు చేయనుంది.
Also Read
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..