Bandi Srinivas : పొరపాటు జరిగిందని అధికారులు అంగీకరించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి భారీ ఎత్తున నగదును విత్ డ్రా పై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన డీఏ ఎరియర్స్ క్రెడిట్ అయిన విషయంలో గందరగోళం ఏర్పడింది. బిల్లులు పాస్ చేయకుండానే క్రెడిట్ డబ్బులు అయ్యాయి. ఉద్యోగులకు సంబంధం లేకుండానే డబ్బులు విత్డ్రా అవ్వడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆందోళనను ఆర్ధిక శాఖ అధికారుల దృష్టికి ఎన్జీవో అసోసియేషన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ములు విత్ డ్రా అవటం పై ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ అంశాన్ని ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ రావత్, సత్యనారాయణలను కలిసి వివరించామని, పొరపాటు జరిగిందని అధికారులు అంగీకరించారన్నారు.
సాంకేతిక సమస్య వల్ల జరిగి ఉంటుందని తెలిపినట్లు, ఈ సాయంత్రం ఐదు గంటల వరకు ఏం జరిగిందో స్పష్టత ఇస్తామన్నారని వారు పేర్కొన్నారు. కింది స్థాయి అధికారుల నుండి నివేదిక తెప్పిస్తామని భరోసా ఇచ్చారని వెల్లడించారు. సీఎఫ్ఎమ్ఎస్ విధానం వల్ల అనేక సాంకేతిక సమస్యలు వస్తున్నాయని, సీఎఫ్ఎమ్ఎస్ వ్యవస్థను రద్దు చేసి పాత ట్రెజరీ విధానాన్నే తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశామన్నారు. సంబంధిత అధికారులు బిల్లులు పాస్ చేయకుండానే కొంత మంది ఉద్యోగులకు డబ్బులు క్రెడిట్ అయినట్లు గమనించారన్నారు. 1-7-2018, 1-1-2019 డీఏ ఎరియర్స్ వేశామని అంటున్నారు అవి క్రెడిట్ కాలేదని చెప్పామన్నారు.
Also Read
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!