AP DGP:ఏపీ పోలీసులపై విశ్వసనీయత పెరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పోలీసుల పనితీరు మెరుగుపడిందని, పోలీసులు బెనిఫిట్స్ గురించి ఎక్కువగా చింతించకండి ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని అన్నారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.రాజమండ్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ను డీజీపీ కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు.ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న డిజిపి పోలీస్ అధికారులు, సచివాలయ మహిళా పోలీసులను ఉద్దేశించి ప్రసంగించారు.
Read Also: BJP MLA: వీధికుక్కల నిర్మూలన మీవల్ల కాదా.? అయితే నాగాలాండ్ ప్రజలను పిలవండి..
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- Pawan Kalyan : పవన్ ఫోకస్తో పెదపెంకికి కొత్త జీవం
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
మహిళా పోలీసుల ద్వారా చిన్న చిన్న గొడవలు పరిష్కారం అవుతున్నాయని డీజీపీ అభినందించారు.గత ఏడాది కాలంలో 77వేల కేసులు తగ్గించామని తెలిపారు. ఎ.పి పోలీస్ శాఖకు ఇది చాలా పెద్ద ఘనత అంటూ కొనియాడారు. అలాగే, కాకినాడ జిల్లాలో యువతిని నడిరోడ్డుపై నరికిన వాడికి నాలుగు నెలల్లో శిక్ష వేయించామని వెల్లడించారు.ఏపీ పోలీసు శాఖపై విశ్వసనీయత పెరిగిందని, దిశ చట్టం వచ్చేలోపు ఆస్ఫూర్తితో ముందుకు వెళుతున్నామని వివరించారు.ప్రతి సిఐ, ఎస్ఐ కి 10 కేసులు చొప్పున దర్యాప్తు పూర్తిచేసేలా అప్పగిస్తున్నామని అన్నారు. హెల్మెట్ లేని వారికి జరిమానాలు వేయకండి కౌన్సిలింగ్ మాత్రమే ఇవ్వండని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు.
ప్రతిపక్షాలు గొంతుక మేమెందుకు నొక్కుతామని, ఇటీవల పలు రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు డీజీపీ కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. పోలీసులు నిర్దేశించిన ప్రకారం ఖాళీ ప్రదేశాల్లోనే బహిరంగ సభలు పెట్టుకోవాలని సూచించారు. ఇరుకైన ప్రదేశాల్లో సభలు అంగీకరించమని స్పష్టం చేశారు. రాజమండ్రిలో డీజీపీ కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నిబంధనలను అతిక్రమించి అనపర్తిలో సభ నిర్వహించడాన్ని తప్పుపట్టారు అనపర్తి కేసులపై దర్యాప్తు వివరాలు వెల్లడిస్తామని అన్నారు. కళాశాలల్లో గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టామని, సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.
Read Also: Leela Pavitra: నడిరోడ్డుపై పవిత్ర దారుణ హత్య.. అక్కడ 16 సార్లు కసితీరా పొడిచి
తాజావార్తలు
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!