AP DGP Rajendranath Reddy: యువతీ యువకులకు కౌన్సిలింగ్ తప్పనిసరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. క్షణికావేశంలో యువతీ, యవకులు, దంపతులు ఆత్మహత్యలకు పాల్పడడం ఈమధ్యకాలంలో ఎక్కువైంది. పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో చదివే విద్యార్ధినీ, విద్యార్ధులు వత్తిడికి తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీస్ ,సైకియాట్రిక్ సొసైటి ఆధ్వర్యంలో విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. బెంజిసర్కిల్ నుండి ఇందిరాగాంధి స్టేడియం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీకి హాజరైన ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆత్మహత్యల నివారణకు చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు.
Read Also: Delhi International Airport: భారీగా బంగారం పట్టివేత.. గాజులరూపంలో తరలించే యత్నం..
Also Read
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం అన్నారు. అనేక అవగాహన సదస్సులు చేపట్టామన్నారు. 8 నుండి 12తరగతి విద్యార్దులు చదువుల వల్ల డిస్టర్బ్ అవుతున్నారు.. తల్లిదండ్రులు తమ పిల్లలపై చదువుల ఒత్తిడి ఆపాలి. క్వాలిటి ఎడ్యుకేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా మార్పులు తెచ్చిందన్నారు డీజీపీ. 18 నుండి 35 వయసులోపు వారు చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. యువతీ యువకులకు నిరంతరం కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉండాలన్నారు. ఇటు రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణపై అవగాహనకు ర్యాలీలు జరుగుతున్నాయి.
అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా కాకినాడలో ఆత్మహత్యల నివారణ అవగాహన ర్యాలీ చేపట్టారు. జిల్లా ఎస్పీ ప్రారంభించి ప్రసంగించారు. అనకాపల్లిలో అంతర్జాతీయ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతోర్యాలీ నిర్వహించారు పోలీసులు. ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ గౌతమి శాలి ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నించాలన్నారు. నంద్యాలలో మున్సిపల్ ఆఫీసు వద్ద ఆత్మహత్యల నివారణ ర్యాలీని ప్రారంభించారు ఎస్పీ రఘువీర్ రెడ్డి, డి.ఎస్.పి మహేశ్వర్ రెడ్డి. సైకియాట్రిక్ సొసైటీ డాక్టర్స్, శాంతిరామ్ హాస్పిటల్ సిబ్బంది, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Read Also: Imran Khan: నన్ను అరెస్ట్ చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.. ప్రభుత్వానికి ఇమ్రాన్ వార్నింగ్

తాజావార్తలు
-
Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!