Narayana Swamy: చంద్రబాబు చాలించు నీ కపట నాటకాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో మరణాలు ఇప్పుడు ఆందోళనకు కలిగిస్తున్నాయి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు. జంగారెడ్డిగూడెంలో వరుసగా జరుగుతున్న మరణాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మిస్టరీగా మారిన మరణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఇక, జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకుంటున్న మరణాలపై టీడీపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించింది. మరణాలపై ప్రభుత్వం స్పందించాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇంత మంది చనిపోతే కూడా ప్రభుత్వం కదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే, ఈ పరిణామాలపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. చంద్రబాబుపై మండిపడ్డారు.. చంద్రబాబు చాలించు నీ కపట నాటకాలు అంటూ ఫైర్ అయ్యారు.
Read Also: Avanthi: పవన్ కల్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది..!
Also Read
జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో మరణించిన 18 మందిలో పోస్ట్ కోవిడ్ లక్షణాలు , హైబీపీ, గుండె సంబందిత సమస్యలు, షుగర్, మూత్రపిండాల వ్యాధి, లివర్ వ్యాధి లక్షణాలతో బాధపడ్డారని తెలిపారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. వీరిలో ముగ్గురుకి పోస్ట్ మార్టం కూడా చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి శాంపిల్స్ పంపించామని తెలిపారు.. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రావాల్సి ఉంది.. వీరి మరణాలను కూడా చంద్రబాబు తన స్వార్థ రాజకీయల కోసం వాడుకోవటం బాధాకరం అన్నారు.. 13 మంది వారి ఇంటి వద్దనే మరణించారని తెలిపిన ఆయన.. ఐదుగురు ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటూ మరణించారని తెలిపారు.. అనారోగ్య సమస్యలతో ఇంటి వద్ద చనిపోయిన వారిని కూడా చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం దురదృష్టకరమని విమర్శించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.
తాజావార్తలు
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
-
Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?
-
Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..
-
Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు?
-
Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్ప్లే, GPS ఫీచర్లతో అదిరింది
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!