ఏపీలో ఇవాళ కరోనా కేసులు కాస్త పెరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,987 శాంపిల్స్ పరీక్షించగా.. 264 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. ఒకరు కరోనా తో మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 247 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
తాజా టెస్ట్లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,02,55,667కు చేరుకున్నాయి.. ఇక, పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,831కు పెరిగితే.. కోలుకున్నవారి సంఖ్య 20,55,226కు చేరుకుంది.. మరోవైపు ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 14,430కు పెరగగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 21,75 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య శాఖ.