CM YS Jagan: పాఠశాల విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష.. కొన్ని మీడియా సంస్థలపై ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM YS Jagan Review Meeting On School Education Department: పాఠశాల విద్యాశాఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నాడు – నేడు కింద పనుల కోసం ఇప్పటిదాకా రూ. 1120 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు వెంటనే పంపిణీ చేయాలని అధికారుల్ని సూచించారు. ప్రస్తుతం లక్షన్నరకు పైగా ట్యాబ్ లు అందుబాటులో ఉన్నాయి. ట్యాబ్లు ఇచ్చిన వెంటనే, అందులో కంటెంట్ను వెంటనే లోడ్ చేయాలని జగన్ ఆదేశించారు. 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు కలిపి మొత్తంగా 5,18,740 ట్యాబ్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ముందుగా టీచర్లకు ట్యాబ్ లను అందజేయనున్నారు. అందులో వారికి కంటెంట్ పై అవగాహన కల్పించిన తర్వాత, స్టూడెంట్స్ కి ట్యాబ్స్ పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. బైజూస్ ఇ–కంటెంటును 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందిస్తామన్నారు.
అలాగే.. విద్యాకానుక కిట్లను ఏప్రిల్ నాటికే సిద్ధం చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. పిల్లలకు ఇచ్చే యూనిఫారం క్లాత్ సైజును పెంచే ప్రతిపాదనకు, స్టిచ్చింగ్ ధరలు పెంచేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం జతకు రూ.40 ఇస్తుండగా, ఇకపై రూ. 50 ప్రభుత్వం ఇవ్వనుంది. స్కూల్ బ్యాగ్ సైజ్ లలోనూ ప్రభుత్వం మార్పులు చేయనుంది. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకూ మీడియం సైజు స్కూలు బ్యాగులు.. 6 నుంచి 10వ తరగతి వరకూ పెద్ద సైజ్ బ్యాగులను అందించనున్నారు. ఈ బ్యాగుల నాణ్యతను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థను థర్డ్ పార్టీగా పెడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో.. స్కూళ్ల మరింత మెరుగైన నిర్వహణ కోసం కొత్త విధానాన్ని కూడా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండల విద్యాశాఖ అధికారితో పాటు మరో అధికారి నియమించనున్నారు. సెర్ఫ్లో పని చేస్తున్న (ఏపీఎం) అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లకు నాన్ అకడమిక్ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తున్నారు. ఈ కొత్త విధానం అక్టోబర్ 17 తేదీ నుంచే అమల్లోకి రానుంది.
Also Read
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- OTR : ముద్రగడ తర్వాత ఆ ప్లేస్ అంబటిదేనా? కాపు పాలిటిక్స్లో రాంబాబు స్పీడ్
- BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
ఈ సమావేశం సందర్భంగానే.. సీఎం జగన్ కొన్ని మీడియా సంస్థలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్కెట్లో వేల రూపాయల ఖర్చయ్యే కంటెంట్ను ఉచితంగా విద్యార్థుల ఫోన్లలో డౌన్లోడ్ చేస్తున్నామని, దాన్ని కూడా వక్రీకరించి కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయని అధికారులు తెలిపారు. దీంతో.. విద్యా సంబంధిత కార్యక్రమాలు, మంచి చేసే నిర్ణయాలను కూడా రాజకీయాల్లోకి లాగడం దురదృష్టకరమని జగన్ మండిపడ్డారు. స్కూలు పిల్లలను కూడా రాజకీయాలను నుంచి మినహాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?