CM Jagan: అవినీతి నిరోధానికి ఏసీబీ మొబైల్ యాప్ ఆవిష్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఏసీబీ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు ఏసీబీ యాప్ తయారు చేసింది. ‘ఏసీబీ 14400’ పేరుతో యాప్ రూపొందించింది. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న స్పందనపై సమీక్ష కార్యక్రమంలో ఏసీబీ యాప్ను సీఎం జగన్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతి ఉండకూడదని స్పష్టంగా చెప్పామని.. ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రూ.1.41 లక్షల కోట్లను అవినీతి లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకి పంపామని ఆయన గుర్తుచేశారు.
ఎక్కడైనా, ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ 14400 యాప్ను డౌన్లోడ్ చేసుకుని బటన్ ప్రెస్ చేసి వీడియో లేదా ఆడియో సంభాషణను రికార్డు చేస్తే ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుందని సీఎం జగన్ వెల్లడించారు. దీంతో ఏసీబీ నేరుగా సీఎంవోకు నివేదిస్తుందని తెలిపారు. ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధంలో బాధ్యత ఉందన్నారు. అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందని.. మన స్థాయిలో అనుకుంటే 50శాతం అవినీతి అంతం అవుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. మిగిలిన స్థాయిలో కూడా అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందని.. అవినీతి లేని పాలన అందించడం మన అందరి కర్తవ్యమని పేర్కొన్నారు. ఎవరైనా అవినీతి చేస్తూ పట్టుబడితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని సీఎం జగన్ హెచ్చరించారు.
Also Read
- 116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
- Kandula Durgesh: "మీ అక్రమ సంబంధం నాకు తెలుసు".. ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!
- AP Weather Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక.. ఈ జిల్లాలు అప్రమత్తం!
ఏసీబీ యాప్ ఎలా పనిచేస్తుంది?
తొలుత పౌరులందరూ గూగుల్ ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ సమయంలో మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ రిజిస్టర్ చేయగానే వినియోగానికి యాప్ సిద్ధంగా ఉంటుంది. ఈ యాప్లో 2 కీలక ఫీచర్లు ఉంటాయి. యాప్ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను నేరుగా లైవ్ రిపోర్ట్ ఫీచర్ను వాడుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఫిర్యాదు కోసం ప్రతి ఒక్కరూ తన దగ్గరున్న డాక్యుమెంట్లను, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించే అవకాశం ఉంది. ఫిర్యాదు రిజిస్టర్ చేయగానే మొబైల్ ఫోన్కు రిఫరెన్స్ నంబరు వస్తుంది. కాగా త్వరలో ఐఓఎస్ వెర్షన్లోనూ ఈ యాప్ను సిద్ధం చేస్తామని ఏసీబీ వెల్లడించింది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : సీఎం రేవంత్ రెడ్డిది గొప్ప సంస్కారం.. భట్టి ప్రశంసలు
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. కాటేరమ్మ కొడుకుతో వైభవ్ ఓపెనింగ్..
-
Male Fertility: సిగరెట్ మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా స్పెర్మ్ కౌంట్ను దెబ్బతీస్తున్నాయి..
-
Om Birla: ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరించాలి
-
Vaibhav Sooryavanshi: ముప్పై ఏళ్ల సచిన్ రికార్డు బద్దలు.. ఎట్టకేలకు టీమిండియా జెర్సీ ధరించిన వైభవ్..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..