ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. అయితే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 55, 525 శాంపిల్స్ పరీక్షించగా… 1174 మందికి పాజిటివ్గా తేలింది… మరో 09 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 1,309 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. ఇక, తాజా కేసులతో కలుపుకొని.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,37, 353 కు చేరగా.. 20,08, 639 మంది డిశ్చార్జ్ అయ్యారు.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్తో మృతిచెందిన వారి సంఖ్య 14, 061 కు పెరిగింది… ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14, 653 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్లో పేర్కొంది సర్కార్.