కేసీఆర్, జగన్ది మూడు ముక్కలాట.. రాత్రి ఫోన్లు.. పగలు ఉత్తరాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు వేదికగా జరిగిన బీజేపీ రాయలసీమ స్థాయి సమావేశం ముగిసింది.. సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధిపై చర్చించారు నేతలు.. ఇక, సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీ, తెలంగాణ సీఎంలపై సంచలన ఆరోపణలు చేశారు.. కేసీఆర్, జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని కామెంట్ చేసిన ఆయన.. రాత్రి ఫోన్లో మాట్లాడుకుంటారు.. పగలు ఉత్తరాలు రాస్తారంటూ విమర్శించారు.. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం రోజున కేసీఆర్ చెప్పింది ఒకటి.. ఇప్పుడు చేస్తున్నదొకటి.. ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి వివాదాలు ఉండవని, కృష్ణ జలాలను ఒప్పందం ప్రకారం పంచుకుంటామని కేసీఆర్ అన్నారని.. కానీ, ఆ మాటను కేసీఆర్ మర్చిపోయారా? గుర్తు చేయడానికి జగన్ సిగ్గుపడుతున్నారా..? అని ప్రశ్నించారు.
కృష్ణ జలాలపై సీఎం జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారు అని ప్రశ్నించారు సోము వీర్రాజు.. తెలంగాణ విషయంలో మాట్లాడబోమని సజ్జల ఎందుకు అంటున్నారు? అని నిలదీసిన ఆయన.. విభజన సమయంలో ఏపీకి చాలా నష్టం జరిగింది.. రాజధాని నష్టపోయాం, భద్రచలం వదులుకున్నాం.. ఆదాయం కోల్పోయామన్నారు.. సోనియాగాంధీ కాళ్లు పట్టుకొని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాలను కేసీఆర్ తెలంగాణలో కలుపుకున్నారన్న ఆయన.. ఏపీకి నష్టం జరుగుతున్నా జగన్ ఎందుకు మాట్లాడడం లేదని ఫైర్ అయ్యారు.. ఇక, ఏపీకి అన్యాయం జరగకుండా బీజేపీ ప్రయత్నిస్తోంది.. చుక్క నీరు వదులుకోమని ప్రకటించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు.. జగన్, కేసీఆర్ తెలివిగా ఉత్తరాలు రాసుకుంటున్నారని విమర్శించిన ఆయన.. కేఆర్ఎంబీ ముందు వాదనలు వినిపించకుండా మాట్లాడమంటే ఎలా…? అని ప్రశ్నించారు. మరోవైపు వివాదాలు లేని పెండింగ్ ప్రాజెక్టులు ఎన్నో వున్నాయి… అవి ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు.. ఏపీ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బీజేపీ ఉద్యమం చేస్తుందని.. త్వరలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు సోము వీర్రాజు.
Also Read
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!