AP Assembly Sessions 2024 LIVE UPDATES: మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ అప్డేట్స్
- మూడో రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
- ప్రశ్నోత్తరాలతో పాటు ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం విడుదల..
- సభలో శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly Sessions 2024 LIVE UPDATES: మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో ప్రశ్నోత్తరాలతో పాటు ఏపీలో గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగానే సభలో శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ అప్డేట్స్ మీ కోసం..
Also Read
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
24 Jul 2024 05:39 PM (IST)
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా. రేపు తెలంగాణ బడ్జెట్.
-
24 Jul 2024 04:45 PM (IST)
మద్యం శ్వేత పత్రంపై కూన రవి కీలక వ్యాఖ్యలు..
మద్యం శ్వేత పత్రంపై చర్చ సందర్భంగా కీలక అంశం ప్రస్తావించిన ఎమ్మెల్యే కూన రవి. మద్యం ఉత్పత్తి కంపెనీల నుంచి డిపోలకు వెళ్లకుండా నేరుగా మద్యం దుకాణాలకే మద్యం వెళ్లింది. వారంలో ఒకటి రెండు రోజుల్లో అడ్డదారిలో మద్యాన్ని ప్రభుత్వ దుకాణాలకు వెళ్లాయి. ఇలా వెళ్లిన మద్యం అమ్మకాల సొమ్ము ప్రైవేట్ వ్యక్తులకే వెళ్లాయి. మద్యం ఆదాయం తగ్గడానికి ఇదీ ఓ కారణంగా పేర్కొన్న కూన రవి..
-
24 Jul 2024 04:28 PM (IST)
మద్యం కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు.. సీఎం ఆదేశాలు..
లిక్కర్ స్కామ్పై సంచలన నిర్ణయం తీసుకున్నారు.. వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఈడీకి రిఫర్ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం ఈడీ దర్యాప్తుకు అర్హమైన కేసుగా పేర్కొన్న ఆయన.. మద్యం విషయంలో మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్లల్లో లక్ష కోట్ల నగదు అమ్మకాలు జరిగాయి.. ఇది భయంకరమైన స్కామ్గా అభివర్ణించారు..
-
24 Jul 2024 04:28 PM (IST)
గత ప్రభుత్వం మద్యం ధరలను 75 శాతం పెంచింది..
మద్య నిషేధం అని హామీ ఇచ్చారు.. ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టారు. మద్యం పాలసీలో అడుగడుగునా తప్పులు చేశారు అని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు... వైసీపీ హయాంలోని మద్యం పాలసీ వల్ల నేరాలు పెరిగాయని విమర్శించారు. గత ప్రభుత్వం మద్యం ధరలను 75 శాతం పెంచింది. మైండ్ ఉండే ఎవ్వడూ ఈ తరహాలో ఎక్సైజ్ పాలసీ రూపొందించరు. ఏం చేసినా జరిగిపోతోందనే అహకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు. పాత బ్రాండ్లను తప్పించారు.. కొత్త బ్రాండ్లను తెచ్చారు. పేదలు తాగే తక్కువ ధర మద్యం బ్రాండ్లు లేకుండా చేశారు. నాకు మద్యం తాగే అలవాటు లేదు.. కానీ, ఏదేదో బ్రాండ్లు తెచ్చారని మా వాళ్లు కొందరు చెబుతున్నారన్నారు.
-
24 Jul 2024 02:38 PM (IST)
నచ్చిన బ్రాండ్లనే అమ్ముకున్నారు..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లలో వాళ్లకు నచ్చిన బ్రాండ్లనే అమ్ముకున్నారు..
-
24 Jul 2024 02:30 PM (IST)
ఏపీలో ఆదాయం తగ్గింది..
పక్క రాష్ట్రంలో ఆదాయం పెరిగింది.. ఏపీలో ఆదాయం తగ్గిపోయింది.. వైసీపీ నేతల జేబుల్లోకి డబ్బులు వెళ్లాయి.. అందుకే ఆదాయం తగ్గింది..
-
24 Jul 2024 02:25 PM (IST)
శ్వేతపత్రం విడుదల..
ఏపీ అసెంబ్లీలో ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం.. గత ప్రభుత్వం అడుగడుగునా తప్పిదాలు చేసింది.. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది.. మద్యం షాపులను తగ్గించినా, మళ్లీ పెంచారు.. మద్యం ధరలను 75 శాతం పెంచారు- సీఎం చంద్రబాబు
-
24 Jul 2024 01:29 PM (IST)
స్వల్ప విరామం..
ఏపీ అసెంబ్లీకి స్వల్ప విరామం.. విరామం తర్వాత మద్యంపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల.. గత ప్రభుత్వంలో మద్యం అవినీతిపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
-
24 Jul 2024 12:55 PM (IST)
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు రద్దు..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం.. ఈ చట్టం అమలులోకి వస్తే ప్రజల ఆస్తులు దోచేసేవారు.. ఇచ్చిన హామి ప్రకారం చట్టాన్ని రద్దు చేస్తున్నాం- సీఎం చంద్రబాబు
-
24 Jul 2024 12:35 PM (IST)
ఇంగ్లీష్ విద్యకు మేం వ్యతిరేకం కాదు..
ఇంగ్లీష్ విద్యకు ఎన్డీయే ప్రభుత్వం వ్యతిరేకం కాదు.. కానీ ఉపాధ్యాయులకు సరైన ట్రైనింగ్ లేకుండా ఇంగ్లీష్ విద్య అమలు సాధ్యం కాదు.. మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు టోఫెల్ శిక్షణ, పరీక్షలు వల్ల పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది.. టోఫెల్ శిక్షణలో అమెరికన్ యాక్సెంట్ వల్ల విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు- మంత్రి నారా లోకేశ్
-
24 Jul 2024 12:35 PM (IST)
హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు..
హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్దరిస్తూ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి సత్య ప్రసాద్.. మహనీయుడైన ఎన్టీఆర్ పేరు మార్చాలనే ఆలోచన గత ప్రభుత్వానికి ఎలా వచ్చిందో.. గత ప్రభుత్వం అడ్డగోలుగా ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టింది- మంత్రి సత్యప్రసాద్ యాదవ్
-
24 Jul 2024 11:50 AM (IST)
నిధుల మళ్లింపుపై పూర్తి సమాచారం ఇవ్వండి..
ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై అధికారుల సమాచారంపై అసంతృప్తి.. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్లో ఎంత మాత్రం మళ్లించ లేదని అధికారుల సమాచారం.. అధికారుల సమాచారానికి భిన్నంగా సభలో మంత్రి డోలా సమాధానం.. నిధుల మళ్లింపుపై పూర్తి సమాచారం ఇవ్వాలని మంత్రి డోలా ఆదేశం..
-
24 Jul 2024 11:36 AM (IST)
రైతు సహయ కేంద్రాలుగా మార్పు..
గతంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను రైతు సహయ కేంద్రాలుగా మార్చుతున్నాం.. రాష్ట్రంలో త్వరలోనే రూ. 674 కోట్లు ధాన్యం బకాయిలు రైతులకు అందిచాలని నిర్ణయం: మంత్రి నాదెండ్ల మనోహార్
-
24 Jul 2024 11:26 AM (IST)
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో అధికార ఎమ్మెల్యే ఆవేదన
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కృష్ణపట్నం పోర్టు అంశంపై చర్చ.. కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టును అదానీ తొలగించడంపై సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆవేదన.. కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టు కోసం అదానీ కాళ్లు పట్టుకుంటాను: ఎమ్మెల్యే సోమిరెడ్డి
-
24 Jul 2024 11:20 AM (IST)
ఇప్పట్లో ఉచిత గ్యాస్ సిలిండర్ లేదు..
ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు.. అయితే 2016 నుంచి 24 వరకూ ప్రధాన మంత్రి ఉజ్వల యువజనం పథకం కింద కొంత మందికి ఇస్తున్నారు.. ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి త్వరలో నిర్ణయం తీసుకొని వివిధ శాఖలతో చర్చించి సభా ముఖంగా మరోసారి వివరాలు తెలియజేస్తాం- మంత్రి నాదెండ్ల మనోహర్
-
24 Jul 2024 11:00 AM (IST)
అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ అసంతృప్తి
అధికారుల తీరుపై అసెంబ్లీ లాబీల్లో చర్చ.. మంత్రులను మాయ చేసేలా సమాచారం ఇస్తున్నారని విమర్శలు.. ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదంటోన్న మంత్రులు.. గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారుల సమాచారంపై డిప్యూటీ సీఎం పవన్ అసంతృప్తి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!