Ramprasad Reddy: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన యువ నాయకుల్లో ఒకరు లోకేష్
- భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసం లోకేష్ చేశారు..
- జగన్ పాలనలో ప్రజల కష్టాలను తెలుసుకోవడానికే లోకేష్ పాదయాత్రను పూర్తి చేశారు..
- భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన యువ నాయకుల్లో ఒకరు లోకేష్: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramprasad Reddy: మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర రెండేళ్లు పూర్తి చేసుకోవడంతో అన్నమయ్య జిల్లాలో రాయచోటిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు చేయని సాహసం నారా లోకేష్ చేశారని తెలిపారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 2 వేల కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర చేసిన ఘనత లోకేష్ కే దక్కుతుందని వెల్లడించారు. ఎందరో నాయకులు పాదయాత్రలు చేశారు.. అన్నీంటిని తలదన్నేలా రాష్ట్రంలోని మండలాలు, గ్రామాల్లో నారా లోకేష్ పర్యటించారు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Udhayanidhi Stalin: ‘‘సనాతన ధర్మం’’పై వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టులో ఉదయనిధికి ఉపశమనం..
Also Read
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
- Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
- Madanapalle Minor Girl Case: మదనపల్లె చిన్నారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు..
ఇక, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజల కష్టాలను తెలుసుకోవడానికే నారా లోకేష్ దిగ్విజయంగా పాదయాత్ర ను పూర్తి చేశాడు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నేడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తున్నామన్నారు. 40 ఏళ్ల యువకుడు నారా లోకేష్ ఎవరు చేయలేని సాహసం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోని అత్యంత ప్రజా ఆదరణ కలిగిన యువ నాయకుల్లో ఒక్కడిగా లోకేష్ బాబు రావడం జరిగిందంటే ఆయన సుదీర్ఘ పాదయాత్రకు లభించిన ఆదరణ అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Fly ash: ఫ్లైయాష్ కోసం టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కర్రలతో దాడి చేసుకున్న ఇరువర్గాలు
ఇక, ఆ రోజు పాదయాత్రలో నారా లోకేష్ ప్రజల నుంచి తెలుసుకున్న కష్ట, నష్టాలను నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరికీ అందిస్తుంది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు కష్టాలు పడ్డారు, ఎక్కడ చూసినా దోపిడిలే.. ఆ రోజుకి ఈ రోజుకి మన జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే.. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టే వాళ్ళు లేరు.. గత ఐదేళ్లలో కడప, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో వందలాది ఘటనలు జరిగాయి.. ఆ ఘటనలలో ఎన్నో కుటుంబాలకు న్యాయం జరిగేలా నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ పార్టీల్లో లక్షలు దాటి కోట్లల్లో సభ్యత్వాలు చేస్తే ఒక ప్రాంతీయ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీలో కోటి దాటి సభ్యత్వాలు చేసిన ఘనత కూడా టీడీపీకి, చంద్రబాబు, నారా లోకేష్ లకే దక్కుతుంది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!