Ramprasad Reddy: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన యువ నాయకుల్లో ఒకరు లోకేష్
- భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసం లోకేష్ చేశారు..
- జగన్ పాలనలో ప్రజల కష్టాలను తెలుసుకోవడానికే లోకేష్ పాదయాత్రను పూర్తి చేశారు..
- భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన యువ నాయకుల్లో ఒకరు లోకేష్: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramprasad Reddy: మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర రెండేళ్లు పూర్తి చేసుకోవడంతో అన్నమయ్య జిల్లాలో రాయచోటిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు చేయని సాహసం నారా లోకేష్ చేశారని తెలిపారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 2 వేల కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర చేసిన ఘనత లోకేష్ కే దక్కుతుందని వెల్లడించారు. ఎందరో నాయకులు పాదయాత్రలు చేశారు.. అన్నీంటిని తలదన్నేలా రాష్ట్రంలోని మండలాలు, గ్రామాల్లో నారా లోకేష్ పర్యటించారు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Udhayanidhi Stalin: ‘‘సనాతన ధర్మం’’పై వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టులో ఉదయనిధికి ఉపశమనం..
Also Read
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
- Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
- Madanapalle Minor Girl Case: మదనపల్లె చిన్నారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు..
- Software Engineers Death: పోటీపడి 19 బీర్లు తాగారు.. మద్యం ఎక్కువై ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి
ఇక, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజల కష్టాలను తెలుసుకోవడానికే నారా లోకేష్ దిగ్విజయంగా పాదయాత్ర ను పూర్తి చేశాడు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నేడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తున్నామన్నారు. 40 ఏళ్ల యువకుడు నారా లోకేష్ ఎవరు చేయలేని సాహసం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోని అత్యంత ప్రజా ఆదరణ కలిగిన యువ నాయకుల్లో ఒక్కడిగా లోకేష్ బాబు రావడం జరిగిందంటే ఆయన సుదీర్ఘ పాదయాత్రకు లభించిన ఆదరణ అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Fly ash: ఫ్లైయాష్ కోసం టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కర్రలతో దాడి చేసుకున్న ఇరువర్గాలు
ఇక, ఆ రోజు పాదయాత్రలో నారా లోకేష్ ప్రజల నుంచి తెలుసుకున్న కష్ట, నష్టాలను నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరికీ అందిస్తుంది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు కష్టాలు పడ్డారు, ఎక్కడ చూసినా దోపిడిలే.. ఆ రోజుకి ఈ రోజుకి మన జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే.. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టే వాళ్ళు లేరు.. గత ఐదేళ్లలో కడప, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో వందలాది ఘటనలు జరిగాయి.. ఆ ఘటనలలో ఎన్నో కుటుంబాలకు న్యాయం జరిగేలా నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ పార్టీల్లో లక్షలు దాటి కోట్లల్లో సభ్యత్వాలు చేస్తే ఒక ప్రాంతీయ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీలో కోటి దాటి సభ్యత్వాలు చేసిన ఘనత కూడా టీడీపీకి, చంద్రబాబు, నారా లోకేష్ లకే దక్కుతుంది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
-
Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
-
SIR Phase-3 : దేశవ్యాప్తంగా ‘SIR ఫేజ్-3’ షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
-
AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!