Ramprasad Reddy: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన యువ నాయకుల్లో ఒకరు లోకేష్
- భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసం లోకేష్ చేశారు..
- జగన్ పాలనలో ప్రజల కష్టాలను తెలుసుకోవడానికే లోకేష్ పాదయాత్రను పూర్తి చేశారు..
- భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన యువ నాయకుల్లో ఒకరు లోకేష్: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramprasad Reddy: మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర రెండేళ్లు పూర్తి చేసుకోవడంతో అన్నమయ్య జిల్లాలో రాయచోటిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు చేయని సాహసం నారా లోకేష్ చేశారని తెలిపారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 2 వేల కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర చేసిన ఘనత లోకేష్ కే దక్కుతుందని వెల్లడించారు. ఎందరో నాయకులు పాదయాత్రలు చేశారు.. అన్నీంటిని తలదన్నేలా రాష్ట్రంలోని మండలాలు, గ్రామాల్లో నారా లోకేష్ పర్యటించారు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Udhayanidhi Stalin: ‘‘సనాతన ధర్మం’’పై వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టులో ఉదయనిధికి ఉపశమనం..
Also Read
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
ఇక, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజల కష్టాలను తెలుసుకోవడానికే నారా లోకేష్ దిగ్విజయంగా పాదయాత్ర ను పూర్తి చేశాడు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నేడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తున్నామన్నారు. 40 ఏళ్ల యువకుడు నారా లోకేష్ ఎవరు చేయలేని సాహసం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోని అత్యంత ప్రజా ఆదరణ కలిగిన యువ నాయకుల్లో ఒక్కడిగా లోకేష్ బాబు రావడం జరిగిందంటే ఆయన సుదీర్ఘ పాదయాత్రకు లభించిన ఆదరణ అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Fly ash: ఫ్లైయాష్ కోసం టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కర్రలతో దాడి చేసుకున్న ఇరువర్గాలు
ఇక, ఆ రోజు పాదయాత్రలో నారా లోకేష్ ప్రజల నుంచి తెలుసుకున్న కష్ట, నష్టాలను నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరికీ అందిస్తుంది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు కష్టాలు పడ్డారు, ఎక్కడ చూసినా దోపిడిలే.. ఆ రోజుకి ఈ రోజుకి మన జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే.. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టే వాళ్ళు లేరు.. గత ఐదేళ్లలో కడప, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో వందలాది ఘటనలు జరిగాయి.. ఆ ఘటనలలో ఎన్నో కుటుంబాలకు న్యాయం జరిగేలా నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ పార్టీల్లో లక్షలు దాటి కోట్లల్లో సభ్యత్వాలు చేస్తే ఒక ప్రాంతీయ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీలో కోటి దాటి సభ్యత్వాలు చేసిన ఘనత కూడా టీడీపీకి, చంద్రబాబు, నారా లోకేష్ లకే దక్కుతుంది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
-
Independence Day TV Offers: బంపరాఫర్.. రూ.11,990కే స్మార్ట్ టీవీ..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
-
Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
-
Janhvi Kapoor : పా. రంజిత్ పర్యవేక్షణలో కోలీవుడ్కి జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీ
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!