Andrapradesh : యూనివర్సిటీలో క్షుద్రపూజలు..విద్యార్థుల్లో భయాందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో ఈ మధ్య క్షుద్రపూజలు ఎక్కువయ్యాయి.. మూఢనమ్మకాల తో జనాలు ఇలాంటి పనులు చేస్తూ తప్పులు చేస్తున్నారు. మొన్న మదన పల్లి ఘటన మరువక ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. తిరుపతి ప్రముఖ యూనివర్సిటీలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి.. ఆ ఘటనతో విద్యార్థులు భయంతో వణికి పోతున్నారు.. ఈ ఘటన ప్రముఖ యూనివర్సిటీ ఎస్వియు లో వెలుగు చూసింది.. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో క్షుద్రపూజలు జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ యూనివర్సిటీలో లైబ్రరీ భవనం సమీపంలోని చౌరస్తాలో క్షుద్రపూజలు చేసినట్టుగా సమాచారం..
ముగ్గు, పుర్రె బొమ్మలు కనిపించాయి. అంతేకాదు, పసుపు, కుంకుమలు కూడా వేసినట్టు కనిపించింది. రాత్రిపూట ఇక్కడ ముగ్గు సున్నం, ఉప్పు, బొగ్గుపొడి తో ముగ్గు వేసినట్టుగా, రక్తం, కోడిగుడ్లతో పూజలు చేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఎస్వీ యూనివర్సిటీలో ప్రాంగణంలో సీసీ కెమెరాలు సరిగా పని చేయడం లేవు. అలాగే, బలమైన సెక్యూరిటీ కూడా లేదు. దీంతో ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు తెలుస్తుంది.. ఎవరో తెలిసిన వాళ్ళే విద్యార్థులను భయపెట్టడానికి చేశారనే వార్తలు వైరల్ అవుతున్నాయి..
Also Read
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
అంత పెద్ద యూనివర్సిటీ లో ఇలా మూఢనమ్మకాలు జరగడం ఇదే మొదటిసారి అంటున్నారు విద్యార్థులు.. అయితే ఈ మధ్య కాలంలో యూనివర్సిటీ పరిసరాలు.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయాయని విద్యార్థి సంఘాల నేతలు, సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రాంగణంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి సీసీ కెమెరాలను సరి చేయాలని, ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, సెక్యూరిటీ గార్డుల సంఖ్యనూ పెంచాలని విద్యార్థులు, వారి తల్లి దండ్రులు కోరుతున్నారు.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా నిందితులను పట్టుకొని పనిలో ఉన్నారు.. ఇది ఎవరో కావాలనే చేశారని కొందరు ఆరోపిస్తున్నారు.. ఏది ఏమైనా ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలిసే వరకు వెయిట్ చెయ్యాల్సిందేనని విద్యార్థులు భావిస్తున్నారు..
తాజావార్తలు
-
Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి