Andrapradesh : యూనివర్సిటీలో క్షుద్రపూజలు..విద్యార్థుల్లో భయాందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో ఈ మధ్య క్షుద్రపూజలు ఎక్కువయ్యాయి.. మూఢనమ్మకాల తో జనాలు ఇలాంటి పనులు చేస్తూ తప్పులు చేస్తున్నారు. మొన్న మదన పల్లి ఘటన మరువక ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. తిరుపతి ప్రముఖ యూనివర్సిటీలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి.. ఆ ఘటనతో విద్యార్థులు భయంతో వణికి పోతున్నారు.. ఈ ఘటన ప్రముఖ యూనివర్సిటీ ఎస్వియు లో వెలుగు చూసింది.. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో క్షుద్రపూజలు జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ యూనివర్సిటీలో లైబ్రరీ భవనం సమీపంలోని చౌరస్తాలో క్షుద్రపూజలు చేసినట్టుగా సమాచారం..
ముగ్గు, పుర్రె బొమ్మలు కనిపించాయి. అంతేకాదు, పసుపు, కుంకుమలు కూడా వేసినట్టు కనిపించింది. రాత్రిపూట ఇక్కడ ముగ్గు సున్నం, ఉప్పు, బొగ్గుపొడి తో ముగ్గు వేసినట్టుగా, రక్తం, కోడిగుడ్లతో పూజలు చేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఎస్వీ యూనివర్సిటీలో ప్రాంగణంలో సీసీ కెమెరాలు సరిగా పని చేయడం లేవు. అలాగే, బలమైన సెక్యూరిటీ కూడా లేదు. దీంతో ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు తెలుస్తుంది.. ఎవరో తెలిసిన వాళ్ళే విద్యార్థులను భయపెట్టడానికి చేశారనే వార్తలు వైరల్ అవుతున్నాయి..
Also Read
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
అంత పెద్ద యూనివర్సిటీ లో ఇలా మూఢనమ్మకాలు జరగడం ఇదే మొదటిసారి అంటున్నారు విద్యార్థులు.. అయితే ఈ మధ్య కాలంలో యూనివర్సిటీ పరిసరాలు.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయాయని విద్యార్థి సంఘాల నేతలు, సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రాంగణంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి సీసీ కెమెరాలను సరి చేయాలని, ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, సెక్యూరిటీ గార్డుల సంఖ్యనూ పెంచాలని విద్యార్థులు, వారి తల్లి దండ్రులు కోరుతున్నారు.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా నిందితులను పట్టుకొని పనిలో ఉన్నారు.. ఇది ఎవరో కావాలనే చేశారని కొందరు ఆరోపిస్తున్నారు.. ఏది ఏమైనా ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలిసే వరకు వెయిట్ చెయ్యాల్సిందేనని విద్యార్థులు భావిస్తున్నారు..
తాజావార్తలు
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!