Andrapradesh : ప్రకాశం జిల్లాలో ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి.. ఒక్కసారిగా మంటలు చెలరేగడం తో ప్రయాణికులు భయబ్రాంతులకు గురైయ్యారు.. జిల్లాలోని జరుగుమల్లి మండలం బిట్రగుంట జాతీయ రహదారిపై ఓ ప్రవేట్ ట్రావెల్ బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. బస్సు లో ముందు పొగలు రావడంతో వాటిని గమనించిన డ్రైవర్ ప్రయాణికులను దిగిపోవాలంటూ అప్రమత్తం చేశారు.
ఘోర బస్సు అగ్ని ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుస్తుంది.. మంటలు అంటుకున్న వెంటనే డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తత తో పెను ప్రమాదం తప్పింది..
Also Read
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వివరాల్లోకి వెళితే.. మోజో ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుండి పాండిచ్చేరి వెళ్తుండగా మార్గంమధ్యంలో ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం బిట్ర గుంట వద్ద కు రాగానే మంటలు వ్యాపించాయి.. బస్సు ఇంజన్ నుంచి పొగలు రావడం తో డ్రైవర్ గమనించారు.. వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను హెచ్చరించారు.. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటానా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది.. ఈ ప్రమాదంలో ప్రయాణికుల లగేజ్ కాలిపోయింది.. జరుగుమల్లి పోలీసులు ఇతర ట్రావెల్స్ బస్సులను రప్పించి ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు పంపించారు. ప్రయాణికుల్లో హైదరాబాద్ కు చెందిన కొంత మంది తెలుగువారు కూడా ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడం కామన్ అయ్యింది.. నాణ్యత లేని, కండిషన్ బాగాలేని బస్సులను ఉపయోగించడం వల్లే ఇలాంటి ప్రమాధాలు జరుగుతున్నాయి.. ఏపీ లో గత కొద్ది రోజులుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఇప్పుడు మరో ఘటన జరగడంతో జనాలు ప్రయాణాలు అంటే భయపడుతున్నారు..ఇలాంటి బస్సులను తనిఖీ చేసి సీజ్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!