ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులినెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1,07,764 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 6341 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 57 మంది మృతిచెందారు.. మరోవైపు.. 24 గంటల్లో 8486 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,39,243 కు చేరుగా.. ఇప్పటి వరకు 12,224 మంది మృతిచెందారు.. రికవరీ కేసులు 17,59,390 కు పెరగగా.. ప్రస్తుతం 67,629 యాక్టివ్ కేసులు ఉన్నాయి.