ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 72,731 సాంపిల్స్ పరీక్షించగా.. 2,100 మందికి పాజిటివ్గా తేలింది.. మరో 21 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. తాజా మృతుల్లో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, తూర్పు గోదావరిలో నలుగురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, అనంతపూర్, గుంటూరు, నెల్లూరులో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చి మ గోదావరిలో ఒక్కొక్కరు ఉన్నారు.. ఇక, ఇదే సమయంలో 3,435 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,05,023కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 18,58,189కి చేరింది.. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 12,870 మంది మృతిచెందితే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 33,964 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. నేటి వరకు 2,24,35,809 సాంపిల్స్ పరీక్షించామని బులెటిన్లో పేర్కొంది సర్కార్..