ఆంధ్రప్రదేశ్లో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి… భారీ సంఖ్యలో టెస్ట్లు చేస్తున్నా.. పాజిటివ్ కేసులు దిగివస్తున్నాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 93,785 శాంపిల్స్ పరీక్షించగా.. 2,526 మంది పాజిటివ్గా తేలింది… మరో 24 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. తాజా మృతుల్లో ప్రకాశం జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు చొప్పున, అనంతపురం, తూర్పుగోదావరి, విశాఖపట్నంలో ఒక్కొక్కరు ఉన్నారు.. ఇదే సమయంలో.. 2,933 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,32,105కు చేరుకోగా.. రికవరీ కేసులు 18,93,498కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 13,081 మంది మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 25,526 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 2,33,14,697 శాంపిల్స్ను పరీక్షించారు.