ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటునకు ముహూర్తం ఖరారు చేసింది ప్రభుత్వం.. ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్య కొత్త జిల్లాల అవతరణ జరగనుంది… ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త జిల్లాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర పడిన విషయం తెలిసిందే.. మరోవైపు… జిల్లా పునర్విభజనకు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ కూడా సిద్ధం అయ్యింది.. దీనికి కాసేపటి కిత్రమే కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.. వర్చువల్గా సమావేశమైన ఏపీ కేబినెట్.. దీనికి ఆమోదం తెలిపింది.. ఇక, త్వరలో గవర్నర్ నుంచి ఆర్డినెన్స్ రాబోతోంది… ప్రస్తుతం రాష్ట్రంలోని లేని గవర్నర్ బిశ్వభూషణ్… ఏప్రిల్ 1వ తేదీన భువనేశ్వర్ నుంచి తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.. ఆ తర్వాత ఆర్డినెన్స్ ఇవ్వనున్నారు.
Read Also: TDP: మూడేళ్లలో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీల పెంపు.. దశలవారీ పోరాటం..
మొత్తంగా 26 జిల్లాలకు ఆమోదం తెలిపింది కేబినెట్.. 26 జిల్లాల్లో 70 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి.. కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నారు.. కొత్తగా మన్యం జిల్లా, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య జిల్లా, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్-విజయవాడ జిల్లాలు ఏర్పాటు కానుండగా… కుప్పం రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు కాబోతోంది.. పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, నగరి, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర కేబినెట్.