Tammineni Sitaram : టీడీపీ అంపశయ్యపై ఉంది.. వెంటిలేటర్ తీసేడయమే మిగిలింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు చేస్తున్నది అసమర్థుడి అంతిమ యాత్ర అంటూ ఎద్దేవా చేశారు.. టీడీపీ అంపశయ్యమీద ఉంది.. వెంటిలేటర్ తీసేయడమే మిగిలిందంటూ వ్యాఖ్యానించారు.. ఎన్టీ రామారావును వైకుంఠానికి పంపిన చంద్రబాబుకు ఎన్టీఆర్ విగ్రహాలను ముట్టుకునే అర్హతలేదని ఫైర్ అయ్యారు.. ప్రజల కలలోకి వచ్చి ఎన్టీఆర్ ఆత్మే చంద్రబాబు దుర్మార్గాలు చెబుతుందన్నారు.. ఇక, చంద్రబాబులో నిరాశ, నిస్ప్రహ పెరిగింది.. పోటీకి ముందే ఆటలో ఓడిపోయినట్టు అర్ధమైందని సెటైర్లు వేశారు. చంద్రబాబుకు అధికారమనే మానసికరోగంతో బాధపడుతున్నారన్న ఆయన.. ప్రజా జీవితంలో ఛాలెంజ్ లు చేసిన వాళ్లు అడ్రస్ లేకుండా పోయారు.. చరిత్ర తిరిగేసుకుంటే అర్ధం అవుతుందన్నారు.
Read Also: Gujarat Elections: గుజరాత్ ఎన్నికల్లో కూలీ పోటీ.. 10 వేల రూపాయి నాణేలతో డిపాజిట్
Also Read
- AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- CM Chandrababu: డీఎస్సీపై కౌంటర్ ఎటాక్.. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
ఇక, ఎన్నికలకు దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకా నీచానికి దిగజారతారు అంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు తమ్మినేని సీతారం.. దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెబుతున్నాను.. తిరుపతిలో నాయి బ్రహ్మలను అవమానిస్తే చంద్రబాబుకు ఏకంగా గుండే కొట్టేశారన్నారు.. ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి తాను అవమానించిన వర్గాల కాళ్లు పట్టు కోవడానికి వెనుకాడరన్న ఆయన.. జగన్ అధికారంలోకి వస్తారని చంద్రబాబు ఊహించ లేదు.. మరోసారి ఓడిపోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. వైఎస్ జగన్ ను ఇబ్బంది పెట్టేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిన్నాయి.. అయినా, జగన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదన్న ఆయన.. చంద్రబాబుకు మహిళల నుంచే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. జగన్, జనం కలిసే వున్నారు.. అసహనం తగ్గించుకోకపోతే నష్టం పెరుగుతుందని చంద్రబాబుకు సలహా ఇచ్చారు. కర్నూలులో ఎదురైన పరిణామాలు లాంటివి భవిష్యత్ లో చాలా జరుగుతాయన్న ఆయన.. శివరామకృష్ణ కమిటీ సూచనలు ఆధారంగానే మూడు రాజధానుల నిర్ణయమని స్పష్టం చేశారు. విశాఖ ప్రపంచ నగరం.. ఈ సిటీని రాజధానిగా అభివృద్ధి చేస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమిటి..? అని నిలదీశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.
తాజావార్తలు
-
Independence Day 2026: ఇంతకీ ఇది 80వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేక 79వదా? ఫుల్ క్లారిటీ ఇదిగో..
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Moto G Max: భారత్ లో మోటో జి మ్యాక్స్ విడుదల.. స్నాప్డ్రాగన్ 6s జెన్ 4 చిప్, 7,000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్స్ ఇవే
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
JoJo : ‘జోజో’ ఫస్ట్ లుక్.. ‘మనోభావాల బ్యాచ్’కి స్వీట్ వార్నింగ్
ట్రెండింగ్
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..