TDP Worker Killed: అనంతపురంలో టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడి చేసి హత్య..
- అనంతపురం జిల్లాలో దారుణం..
- రాయదుర్గం మండలంలోని మెచ్చరి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త దారుణ హత్య..
- నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Worker Killed: అనంతపురం జిల్లా రాయదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. రాయదుర్గం మండలం మెచ్చరి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఆదెప్పను దారుణ హత్య చేశారు. ప్రత్యర్థులు కత్తులతో విచక్షిణారహితంగా పొడిచి చంపి.. మృతదేహాన్ని గ్రామ శివారులో పడవేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులో ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఆదెప్ప మంగళవారం వ్యక్తిగత పని మీద సరిహద్దునే ఉన్న కర్ణాటకకు వెళ్లి.. తిరిగి సాయంత్రం 6 గంటల సమయంలో వస్తుండగా ఈ హత్య జరిగినట్లు ఆదెప్ప తరపు బంధువులు వెల్లడించారు.
Read Also: Bypolls: 7 రాష్ట్రాల్లోని 17 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్.. మరోసారి ఎన్డీయే వర్సెస్ ఇండియా బ్లాక్
Also Read
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Kethireddy Venkatarami Reddy: సెలబ్రిటీల మౌనంపై కేతిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. పద్మశ్రీల భయమా..?
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
కాగా, మొలకాల్మూర్ తాలూకా పేదారగుడ్డం వెళ్లే మార్గంలో ఆదెప్ప మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన రాయదుర్గం పట్టణ సీఐ శ్రీనివాసులు సంఘటన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. ఇంటి నుంచి ఆదెప్ప తీసుకెళ్లిన టూవీలర్ను పక్కనే వదిలేసి వెళ్లడంతో కర్ణాటకలో హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మరో వాదన కూడా తెర మీదకు వస్తుంది. గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో అర్చకత్వంపై గత కొంత కాలంగా టీడీపీ, వైసీపీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. టీడీపీ అధికారంలోకి రావడంతో రెండు రోజుల క్రితమే దేవాలయం తలుపులు తెరిచి పూజా కార్యక్రమాలు నిర్వహించిన గ్రామస్తులు.. అయితే, దేవాలయం పునః ప్రారంభం కార్యక్రమంలో ఆదెప్ప పూజలు చేయడంతో వైసీపీ నాయకులు అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!