JC Prabhakar Reddy: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.. తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జేసీ.. తాడిపత్రిలో జన్మించిన ప్రతి ఒక్కరూ పుణ్యాత్ములు అని పేర్కొన్నారు జేసీ.. “తాడిపత్రిలో తినడానికి మూడు పూటలా అన్నం దొరుకుతుంది. ఈ భూమి ఎంతో శక్తివంతమైనది. చరిత్రలో శ్రీ కృష్ణదేవరాయలు తాడిపత్రిలో ఆలయాలు నిర్మించడానికి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు..” అని వెల్లడించారు..
ఇక, తాడిపత్రి భూమి మీద ఉన్న శక్తిని చాటుతూ, “ఇక్కడ సూర్యశక్తి (సోలార్) ప్రాజెక్ట్ను రెండు నెలల్లో పూర్తిచేస్తాము. ఈ ప్రాజెక్ట్ ద్వారా మున్సిపాలిటీకి నెలకు 20 లక్షల ఆదాయం వస్తుంది,” అని జేసీ ప్రభాకర్ రెడ్డి వివరించారు. మరోవైపు.. నా శత్రువు కూడా నా గురించి ఆలోచించి మాట్లాడే విధంగా చేసుకోవడం నా కోరిక.. ఎక్కడైనా, తాడిపత్రిలో బ్రతకలేని వ్యక్తి దేశంలో ఎక్కడ బ్రతకలేడు, అని ఆయన తమ పట్టణం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి చరిత్ర, ప్రస్తుత పరిస్థితులు మరియు భవిష్యత్తు అభివృద్ధిపై గౌరవంతో మాట్లాడారు. ఆయన మున్సిపాలిటీకి సౌరశక్తి ఆధారిత ప్రాజెక్టు ద్వారా ఆదాయాన్ని పెంచడంపై దృష్టి సారించామని తెలిపారు..
మరోవైపు, తాడిపత్రి పట్టణంలో 4 కోట్ల రూపాయలతో సోలార్ ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవానికి భూమి పూజ చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. జేసీ పార్కు వద్ద 40 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ ఖజానాలో ఒక్క రూపాయి లేదు… సంక్షేమ పథకాలు అమలు చేసేందుకే రాష్ట్ర ఆదాయం సరిపోతుందన్నారు. తాడిపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకే… ఖర్చులు పైసా పైసా ఆదా చేస్తూ… పరిశ్రమలు తీసుకొస్తున్నాం. సోలార్ ఏర్పాటు అయితే మున్సిపాలిటీ కి నెల నెలా 22 లక్షలు డబ్బులు ఆదా అవుతుంది. తాడిపత్రి త్వరలో డ్రీమ్ సిటీ గా మారబోతోంది.. ఏడాది తర్వాత తాడిపత్రి రూపురేఖలు మారిపోతాయని తెలిపారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి..