Anam Ramanarayana Reddy: ఆ భగవంతుని ఆస్తులను రక్షించడమే నా బాధ్యత..
- సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆనం రామానారాయణ రెడ్డి..
- భగవంతుని ఆస్తులకు రక్షకునిగా ఉండాలనే నాకు ఈ బాధ్యత ఇచ్చారు..
- దేవాదాయ శాఖలో ఏ చిన్న సంఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటాం: మంత్రి ఆనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anam Ramanarayana Reddy: ఏపీ సచివాలయంలో ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలను స్వీకరించారు. బ్లాక్-2లోని తన ఛాంబర్లో పూజలు చేసిన వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలిచ్చారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేవాదాయ శాఖకు సంబంధించిన పలు దస్త్రాలను మంత్రి ఆనం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భగవంతుని ఆస్తులకు రక్షకునిగా వుండాలని నాకు ఈ బాధ్యత ఇచ్చారు.. గత ప్రభుత్వంలో తిరుమల నుంచి అరసవల్లి వరకు భూములు అన్యాక్రాంతం అయ్యాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఏ చిన్న సంఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పుకొచ్చారు.
Read Also: Uddhav Thackeray: ‘నాకు బీజేపీ రహిత రాముడు కావాలి’.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
కాగా, సీఎం చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రజాగళం, యువగళంలలో వచ్చిన వినతులను పరిష్కరిస్తాం.. రూ. 50 వేల కంటే తక్కువ ఉన్న దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాల నిమిత్తం రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. దీనికి సంబంధించి రూ.32 కోట్లు అదనపు భారం దేవాదాయ శాఖపై పడుతుంది అన్నారు. తప్పులు చేసిన వారిని వదిలేది లేదు.. నెల్లూరు జిల్లాలో రెండు ఆలయాలలో తప్పులు జరిగినట్టు నిర్ధారించి 5 అధికారులను సస్పెండ్ చేశామని ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.
Read Also: Gold Rate Today: బంగారం ధరలకు బ్రేక్.. నేడు తులం బంగారం ఎంతుందంటే?
ఇక, దేవదాయ శాఖకు చెందిన ఓ అధికారిణిని సస్పెండ్ చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పుకొచ్చాురు. 160 దేవాలయాలను పునర్నిర్మాణం చేయబోతున్నాం.. 13 వెనుకబడిన ప్రాంతాలు ట్రైబల్ ఏరియాలో ఉన్న గుళ్లనూ పునర్నిర్మాణం చేయాలని ఆదేశించాం.. కృష్ణ , గోదావరి సంగమం వద్ద జలహారతి తిరిగి కొనసాగించనున్నామన్నారు.. అలాగే, రేపు కెబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది అని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!