Botsa Satyanarayana: త్వరలోనే రాజయ్యపేటకు జగన్.. ప్రభుత్వంపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు..
- రాజయ్యపేటలో మత్య్సకారుల సమస్యలను విన్న వైసీపీ నేతలు..
- బొత్స ముందు కంటతడి పెట్టుకున్న మత్య్సకార మహిళలు..
- త్వరలోనే రాజయ్యపేటకు వైఎస్ జగన్ వస్తారు: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: అనకాపల్లి జిల్లాలోని రాజయ్య పేట మత్స్యకారుల సమస్యలను వైసీపీ నేతలు విన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ను రద్దు చేయించాలని బొత్స సత్యనారాయణ ముందు మత్స్యకార మహిళలు కంట తడిపెడుతున్నారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమల వల్ల ప్రశాంతత కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వంతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని మత్య్సకారులు కోరారు. ఇక, శాసన మండలిలో విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. త్వరలోనే రాజయ్య పేటకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తారని తెలిపారు. మత్స్యకారులకు సంఘీభావంగా మేం నిలబడతాం.. యావత్ పార్టీ మీ వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు. బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకిస్తున్న ప్రజలు సంఘ విద్రోహ శక్తులా?.. ఎందుకీ నిర్బంధం అని ఆయన ప్రశ్నించారు. మత్స్యకారుల పోరాటానికి వైసీపీ అండగా నిలబడుతుంది.. అధికారంలోకి వచ్చిన వెంటనే బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేస్తామన్నారు. హోంమంత్రి అనితకు చేతకాకపోతే రాజకీయాలు మానుకో అని మండిపడ్డారు. ఉపమాక వెంకటేశ్వర స్వామి సాక్షిగా తప్పు చేసిన వాళ్ళకు శిక్ష తప్పదు అన్నారు. రాజయ్యపేట గ్రామస్తుల అభిప్రాయాలను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళతామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Read Also: Story of Satish Prasad Singh: ఐదు రోజుల సీఎం.. బీహార్ తొలి ఓబీసీ ముఖ్యమంత్రి కథ..!
Also Read
అలాగే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు లెక్చర్లు ఇచ్చిన అనిత ఏమైపోయారు?.. క్యాన్సర్లు వస్తాయని., బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేస్తామని చేసిన ప్రకటనలు ఏమయ్యాయి.. అనితను గెలిపించినందుకు ప్రజలు లెంపలు వేసుకుంటున్నారు.. ఎన్ని కేసులైనా పెట్టుకోనివ్వండి 2029లో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎత్తేస్తాం.. చంద్రబాబు పెద్దల పక్షం.. జగన్ పేదల పక్షం అన్నారు. ఇక, మాజీమంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. బల్క్ డ్రగ్ పార్క్ కు వైసీపీ వ్యతిరేకం.. జగన్మోహన్ రెడ్డి మాటగా మాది హామీ.. మేం రాజకీయాలు చేయడానికి రాలేదు.. సమస్య పరిష్కారం కోసం సంఘీభావం తెలిపాం.. గ్రామంలోకి రావాలంటే పోలీసులు ఆధార్ కార్డు అడుగుతున్నారు.. కొన్ని రోజులు పోతే పాస్ పోర్టులు కూడా అడుగుతారు.. వందల ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్న ప్రజలు ఈ దేశం, రాష్ట్రానికి చెందిన వాళ్ళ లేక పొరుగు దేశం వాళ్ళా? అని ప్రశ్నించారు.
Read Also: Shruti Haasan : డైలామాలో శృతి హాసన్ కెరీర్
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. హోంమంత్రి అనిత నమ్మించి మోసం చేసింది.. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయమని అనిత చెప్పింది.. మా ఊరి ఆడపిల్ల అని నమ్మి మా గ్రామం నుంచి 2000 మెజార్టీ ఇచ్చాం.. మమ్మల్ని చంపి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు జగన్ నే న్యాయం చేయాలి.. కూటమి ప్రభుత్వం వల్ల మాకు న్యాయం జరగదు.. బల్క్ డ్రగ్ పార్క్ వలన మా జీవితాలు నాశనమవుతాయి.. ఏం పాపం చేశామని మమ్మల్ని వేధిస్తున్నారు.. మా ప్రాణాల పోయినా పర్వాలేదు.. ఇక్కడ బల్క్ డ్రగ్ పార్కు కట్టనివ్వమని స్థానికులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!