Botsa Satyanarayana: త్వరలోనే రాజయ్యపేటకు జగన్.. ప్రభుత్వంపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు..
- రాజయ్యపేటలో మత్య్సకారుల సమస్యలను విన్న వైసీపీ నేతలు..
- బొత్స ముందు కంటతడి పెట్టుకున్న మత్య్సకార మహిళలు..
- త్వరలోనే రాజయ్యపేటకు వైఎస్ జగన్ వస్తారు: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: అనకాపల్లి జిల్లాలోని రాజయ్య పేట మత్స్యకారుల సమస్యలను వైసీపీ నేతలు విన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ను రద్దు చేయించాలని బొత్స సత్యనారాయణ ముందు మత్స్యకార మహిళలు కంట తడిపెడుతున్నారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమల వల్ల ప్రశాంతత కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వంతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని మత్య్సకారులు కోరారు. ఇక, శాసన మండలిలో విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. త్వరలోనే రాజయ్య పేటకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తారని తెలిపారు. మత్స్యకారులకు సంఘీభావంగా మేం నిలబడతాం.. యావత్ పార్టీ మీ వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు. బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకిస్తున్న ప్రజలు సంఘ విద్రోహ శక్తులా?.. ఎందుకీ నిర్బంధం అని ఆయన ప్రశ్నించారు. మత్స్యకారుల పోరాటానికి వైసీపీ అండగా నిలబడుతుంది.. అధికారంలోకి వచ్చిన వెంటనే బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేస్తామన్నారు. హోంమంత్రి అనితకు చేతకాకపోతే రాజకీయాలు మానుకో అని మండిపడ్డారు. ఉపమాక వెంకటేశ్వర స్వామి సాక్షిగా తప్పు చేసిన వాళ్ళకు శిక్ష తప్పదు అన్నారు. రాజయ్యపేట గ్రామస్తుల అభిప్రాయాలను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళతామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Read Also: Story of Satish Prasad Singh: ఐదు రోజుల సీఎం.. బీహార్ తొలి ఓబీసీ ముఖ్యమంత్రి కథ..!
Also Read
- Botsa Satyanarayana: పంచదార్లలో వైసీపీ నేత బొత్స సంచలన వ్యాఖ్యలు.. సర్కార్ పై తీవ్ర ఆరోపణలు
- Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె 'మేకప్ మంత్రి'..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- Gudivada Amarnath: జగన్ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!
అలాగే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు లెక్చర్లు ఇచ్చిన అనిత ఏమైపోయారు?.. క్యాన్సర్లు వస్తాయని., బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేస్తామని చేసిన ప్రకటనలు ఏమయ్యాయి.. అనితను గెలిపించినందుకు ప్రజలు లెంపలు వేసుకుంటున్నారు.. ఎన్ని కేసులైనా పెట్టుకోనివ్వండి 2029లో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎత్తేస్తాం.. చంద్రబాబు పెద్దల పక్షం.. జగన్ పేదల పక్షం అన్నారు. ఇక, మాజీమంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. బల్క్ డ్రగ్ పార్క్ కు వైసీపీ వ్యతిరేకం.. జగన్మోహన్ రెడ్డి మాటగా మాది హామీ.. మేం రాజకీయాలు చేయడానికి రాలేదు.. సమస్య పరిష్కారం కోసం సంఘీభావం తెలిపాం.. గ్రామంలోకి రావాలంటే పోలీసులు ఆధార్ కార్డు అడుగుతున్నారు.. కొన్ని రోజులు పోతే పాస్ పోర్టులు కూడా అడుగుతారు.. వందల ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్న ప్రజలు ఈ దేశం, రాష్ట్రానికి చెందిన వాళ్ళ లేక పొరుగు దేశం వాళ్ళా? అని ప్రశ్నించారు.
Read Also: Shruti Haasan : డైలామాలో శృతి హాసన్ కెరీర్
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. హోంమంత్రి అనిత నమ్మించి మోసం చేసింది.. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయమని అనిత చెప్పింది.. మా ఊరి ఆడపిల్ల అని నమ్మి మా గ్రామం నుంచి 2000 మెజార్టీ ఇచ్చాం.. మమ్మల్ని చంపి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు జగన్ నే న్యాయం చేయాలి.. కూటమి ప్రభుత్వం వల్ల మాకు న్యాయం జరగదు.. బల్క్ డ్రగ్ పార్క్ వలన మా జీవితాలు నాశనమవుతాయి.. ఏం పాపం చేశామని మమ్మల్ని వేధిస్తున్నారు.. మా ప్రాణాల పోయినా పర్వాలేదు.. ఇక్కడ బల్క్ డ్రగ్ పార్కు కట్టనివ్వమని స్థానికులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!